Begin typing your search above and press return to search.
సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఓటీటీ-ఏటీటీలు రీ ప్లేస్ చేయలేవు'
By: Tupaki Desk | 6 July 2021 11:00 PM IST'ఈ రోజుల్లో' సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమైన ఎస్కేఎన్.. 'టాక్సీవాలా' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ - యూవీ క్రియేషన్స్ వారితో కలిసి 'భలే భలే మగాడివోయ్' 'మహానుభావుడు' 'ప్రతిరోజూ పండగే' వంటి సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నాడు. అల్లు అర్జున్ - రామ్ చరణ్ - రవితేజ వంటి స్టార్ హీరోలకు పీఆర్వోగా పని చేసిన SKN.. నేడు (జూలై 7) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎస్కేఎన్ మీడియాతో మాట్లాడుతూ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లు.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ విశేషాలు..
– ప్రస్తుతం మారుతి అండ్ టీమ్ డైరెక్ట్ చేస్తున్న ఓ సినిమాను యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్నా. దర్శక నిర్మాత సాయి రాజేష్ తో కలిసి మూడు సినిమాలు చేయనున్నాను. 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ తో రెండు సినిమాలు ఉన్నాయి. ఆషాడ మాసం వెళ్లిపోయిన తర్వాత వీటి వివరాలు తెలియజేస్తాం. 'టాక్సీవాలా' డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ - వీఐ ఆనంద్ - 'పలాస ఫేమ్ కరుణ్ కుమార్ లతో కూడా సినిమాలు ఉన్నాయి. ఆహా ఓటీటీ కోసం 'త్రీ రోజేస్'.. జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చర్చలు తుదిదశలో ఉన్నాయి. ప్రస్తుతం మూడు సినిమాలు, మూడు వెబ్ సిరీస్ లు సెట్స్ పై ఉన్నాయి. ఇక కొత్త ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మారుతి గారు, నేను కలిసి మాస్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేసి, వెబ్ కంటెంట్ ను వ్యూయర్స్ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం.
– సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఓటీటీ ఏటీటీలు రీ ప్లేస్ చేయలేవు. కొన్ని సినిమాలను తెరపైనే చూడాలి. కానీ కరోనా వల్ల కొంతమంది నిర్మాతలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో వారు ఓటీటీలకు వెల్లడంలో తప్పులేదేమో. కానీ థియేటర్స్ వ్యవస్థ లేకపోతే స్టార్డమ్ తగ్గిపోయింది. థియేటర్స్ వ్యవస్థ మనుగడ బాగుండాలి. అది థియేటర్స్ కు మాత్రమే కాదు..ఇండస్ట్రీకి కూడా మేలు. కొంతమంది నిర్మాతలు ఈ పరిస్థితుల్లో ఓటీటీలకు వెళుతున్నారు. దాన్ని తప్పుపట్టలేం. కానీ ఒక వ్యక్తిగా, ప్రేక్షకుడిగా, నిర్మాతగా నేను థియేటర్స్ బిగ్ స్క్రీన్ పై సినిమా చూసేందుకే మొగ్గుచూపుతాను. ఒకసారి థియేటర్స్ లో సినిమా ప్రదర్శితమైన తర్వాత ఓటీటీకి వస్తేనే బెటర్ అని నా అభిప్రాయం.
– లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ చేస్తే తెలుగు ప్రేక్షకులు మునపటిలానే వచ్చారు. స్టార్ హీరో సినిమాలు విడుదలైనప్పటికీ ఏ ఇండస్ట్రీలోనూ ఇలా జరగలేదు. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. కరోనా సెకండ్ వేవ్ వస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ గారి 'వకీల్ సాబ్' వస్తే ఎంతటి ఓపెనింగ్ వచ్చాయో మనందరికీ తెలుసు. అలాగే 'క్రాక్', 'జాతిరత్నాలు', ఫస్ట్ వేవ్ తర్వాత విడుదలైన తొలి సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరించారు. సినిమా మన దైనందిన జీవితంలో ఓ భాగం. మనం ఆఫీకు వెళ్తున్నాం. హోటల్ కు వెళ్తున్నాం. అలాగే సినిమాలకు వెళతాం. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ప్రేక్షకుల్లో కూడా కాస్త భయం తగ్గింది. థర్డ్ వేవ్ లేకపోతే థియేటర్స్ రీ ఓపెన్ అయితే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారనే అనుకుంటున్నాం.
– నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరలు ఎంతలా పెరుగుతున్నాయో చూస్తునే ఉన్నాం. సినిమా ఆపరేటింగ్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది. అలాగే సినిమా టికెట్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అయినా టికెట్ ధరలు పెరగడం వల్ల నిర్మాతలకు పెద్దగా లాభం ఉండదు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని రాయితీలను ఇస్తుంది. ఇండస్ట్రీని ఓ పరిశ్రమలా కాకుండా కళగా గుర్తించి ప్రభుత్వం వినోద రంగాన్ని ప్రొత్సహించాలని కోరుకుంటున్నాం. కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాల్లో ఎంటర్టైన్మెంట్ సెక్టార్ కూడా ఉంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలి. ఇక సినిమాల విడుదల తేదీలు మన చేతుల్లో లేవు.
– ప్రస్తుతం మారుతి అండ్ టీమ్ డైరెక్ట్ చేస్తున్న ఓ సినిమాను యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్నా. దర్శక నిర్మాత సాయి రాజేష్ తో కలిసి మూడు సినిమాలు చేయనున్నాను. 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ తో రెండు సినిమాలు ఉన్నాయి. ఆషాడ మాసం వెళ్లిపోయిన తర్వాత వీటి వివరాలు తెలియజేస్తాం. 'టాక్సీవాలా' డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ - వీఐ ఆనంద్ - 'పలాస ఫేమ్ కరుణ్ కుమార్ లతో కూడా సినిమాలు ఉన్నాయి. ఆహా ఓటీటీ కోసం 'త్రీ రోజేస్'.. జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చర్చలు తుదిదశలో ఉన్నాయి. ప్రస్తుతం మూడు సినిమాలు, మూడు వెబ్ సిరీస్ లు సెట్స్ పై ఉన్నాయి. ఇక కొత్త ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మారుతి గారు, నేను కలిసి మాస్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేసి, వెబ్ కంటెంట్ ను వ్యూయర్స్ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం.
– సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఓటీటీ ఏటీటీలు రీ ప్లేస్ చేయలేవు. కొన్ని సినిమాలను తెరపైనే చూడాలి. కానీ కరోనా వల్ల కొంతమంది నిర్మాతలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో వారు ఓటీటీలకు వెల్లడంలో తప్పులేదేమో. కానీ థియేటర్స్ వ్యవస్థ లేకపోతే స్టార్డమ్ తగ్గిపోయింది. థియేటర్స్ వ్యవస్థ మనుగడ బాగుండాలి. అది థియేటర్స్ కు మాత్రమే కాదు..ఇండస్ట్రీకి కూడా మేలు. కొంతమంది నిర్మాతలు ఈ పరిస్థితుల్లో ఓటీటీలకు వెళుతున్నారు. దాన్ని తప్పుపట్టలేం. కానీ ఒక వ్యక్తిగా, ప్రేక్షకుడిగా, నిర్మాతగా నేను థియేటర్స్ బిగ్ స్క్రీన్ పై సినిమా చూసేందుకే మొగ్గుచూపుతాను. ఒకసారి థియేటర్స్ లో సినిమా ప్రదర్శితమైన తర్వాత ఓటీటీకి వస్తేనే బెటర్ అని నా అభిప్రాయం.
– లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ చేస్తే తెలుగు ప్రేక్షకులు మునపటిలానే వచ్చారు. స్టార్ హీరో సినిమాలు విడుదలైనప్పటికీ ఏ ఇండస్ట్రీలోనూ ఇలా జరగలేదు. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. కరోనా సెకండ్ వేవ్ వస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ గారి 'వకీల్ సాబ్' వస్తే ఎంతటి ఓపెనింగ్ వచ్చాయో మనందరికీ తెలుసు. అలాగే 'క్రాక్', 'జాతిరత్నాలు', ఫస్ట్ వేవ్ తర్వాత విడుదలైన తొలి సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరించారు. సినిమా మన దైనందిన జీవితంలో ఓ భాగం. మనం ఆఫీకు వెళ్తున్నాం. హోటల్ కు వెళ్తున్నాం. అలాగే సినిమాలకు వెళతాం. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ప్రేక్షకుల్లో కూడా కాస్త భయం తగ్గింది. థర్డ్ వేవ్ లేకపోతే థియేటర్స్ రీ ఓపెన్ అయితే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారనే అనుకుంటున్నాం.
– నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరలు ఎంతలా పెరుగుతున్నాయో చూస్తునే ఉన్నాం. సినిమా ఆపరేటింగ్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది. అలాగే సినిమా టికెట్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అయినా టికెట్ ధరలు పెరగడం వల్ల నిర్మాతలకు పెద్దగా లాభం ఉండదు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని రాయితీలను ఇస్తుంది. ఇండస్ట్రీని ఓ పరిశ్రమలా కాకుండా కళగా గుర్తించి ప్రభుత్వం వినోద రంగాన్ని ప్రొత్సహించాలని కోరుకుంటున్నాం. కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాల్లో ఎంటర్టైన్మెంట్ సెక్టార్ కూడా ఉంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలి. ఇక సినిమాల విడుదల తేదీలు మన చేతుల్లో లేవు.
