Begin typing your search above and press return to search.

మరోసారి మణిరత్నం సినిమాకు ఆటంకం..!

By:  Tupaki Desk   |   28 April 2021 7:30 AM GMT
మరోసారి మణిరత్నం సినిమాకు ఆటంకం..!
X
ఇండియన్ లెజెండరీ దర్శకులలో ఒకరు మణిరత్నం. ఆయన ఒక్కో సినిమా ఒక్కో లైబ్రరీ అంటూ చెబుతుంటారు సినీ సెలబ్రిటీలు. అలాగే మణిరత్నం మేకింగ్ స్టైల్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కొన్నేళ్లుగా సరైన సాలిడ్ హిట్టుకోసం ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కటి అంతలా ఆకట్టుకోలేకపోయింది. మణిరత్నం నుండి చివరిగా నవాబ్ అనే సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా కూడా ఆశించిన ఫలితం దక్కించుకోలేదు. అందుకే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమానే లైన్ లో పెట్టేసాడు మణిరత్నం. పొన్నియన్ సెల్వన్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ స్టార్ యాక్టర్స్ అందరూ నటిస్తున్నారు.

కానీ ఈ సినిమాకు మొదటినుండి షూటింగ్ వాయిదాపడుతూనే ఉంది. ఇటీవలే చిత్రబృందం పొన్నియన్ సెల్వన్ షూటింగ్ షెడ్యూల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్లాన్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ అక్కడ కాన్సల్ అయిపోయింది. సరే దూరం వెళ్లకుండా చెన్నైలోనే షూటింగ్ కానిద్దాం అనుకుంటే ఇక్కడ కూడా అదే స్థాయిలో కరోనా పరిస్థితి నెలకొంది. అందుకే చెన్నైలో కూడా పొన్నియన్ షూటింగ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం మణిరత్నం టీమ్ పరిస్థితులు చక్కబడితే జూన్ లో షూటింగ్ ప్రారంభిద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, విక్రమ్, కార్తీ, అతిథిరావు హైదరి, జయం రవి, త్రిష ఇలా చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.