Begin typing your search above and press return to search.

రంగస్థలంకు అప్పిచ్చిన టివి ఛానల్?

By:  Tupaki Desk   |   2 April 2018 5:49 AM GMT
రంగస్థలంకు అప్పిచ్చిన టివి ఛానల్?
X
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎట్టకేలకు మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని కలెక్షన్స్ చూస్తేనే అర్ధమవుతోంది. మొదటి వారం దాదాపు అన్ని షోలు హౌజ్ ఫుల్ అయ్యాయి. మొత్తంగా సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాన్ బాహుబలి రికార్డులు బద్దలవ్వడం నెక్స్ట్ టార్గెట్ అని తెలుస్తోంది.

అయితే సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొదట తక్కువ బడ్జెట్ లో సినిమాను ఫినిష్ చేయాలనీ అనుకున్నారు. కానీ కథ పరంగా బడ్జెట్ పెంచక తప్పలేదు. అందులోను సుకుమార్ రీ షూట్ లు ఉండడం సినిమా బడ్జెట్ ని పెంచేసింది. అయితే ఫైనల్ గా మంచి అవుట్ ఫుట్ రావడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. నిర్మాతలు మధ్యలో కొంత అమౌంట్ ను ఇతరుల వద్ద నుంచి తెచ్చారట.

ముఖ్యంగా ప్రముఖ ఎన్టీవీ మీడియా ఛానెల్ అధినేత నరేంద్ర చౌదరి సినిమా బడ్జెట్ లో భాగమయ్యారు. 15 కోట్ల వరకు రంగస్థలం సినిమాకు ఫైనాన్స్ చేసినట్లు టాక్ వినబడుతోంది. ఇక సినిమా లాబలా పంట పండుతుండంతో మైత్రి మూవీ మేకర్స్ వారిలో ఆందోళన తగ్గింది. ఇప్పటికే యూఎస్ లో కూడా సినిమా 2 మిలీయన్ల డాలర్లను క్రాస్ చేసింది. ఇండియాలో కూడా 100 కోట్లు కొల్లగొట్టడానికి ఈ సినిమా స్పీడ్ గా వెళుతోందని బాక్స్ ఆఫీస్ ఎనలిస్ట్ లు చెబుతున్నారు.