Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్లానింగ్ అదుర్స్..!

By:  Tupaki Desk   |   27 March 2021 3:30 PM GMT
ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్లానింగ్ అదుర్స్..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో వరుస హిట్స్ అందుకుంటూ సక్సెస్ ఫుల్ హీరో గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం) అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం మే నెలలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కన్నడ స్టార్ డైరెక్టర్ 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ - తమిళ స్టార్ డైరెక్టర్ గా ఉన్న అట్లీ లతో తారక్ సినిమాలు చేయనున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అలానే వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అట్లీ మూవీ ఉంటుందని టాక్. ఇలా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ వస్తున్న ఎన్టీఆర్.. వీటిని కంప్లీట్ చేసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. తారక్ - జక్కన్న కాంబినేషన్ లో వస్తున్న నాల్గవ సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. మరి ఐదోసారి వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందో లేదో తెలియడానికి ఇంకాస్త సమయం పెట్టనుంది. ఏదేమైనా ప్రస్తుతం ఎన్టీఆర్ పపాన్ ఇండియా లైనప్ మాత్రం ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోందని చెప్పవచ్చు.