Begin typing your search above and press return to search.

BB3 నిర్మాత పై నాన్ బెయిల‌బుల్ వారెంట్

By:  Tupaki Desk   |   13 March 2021 3:38 AM GMT
BB3 నిర్మాత పై నాన్ బెయిల‌బుల్ వారెంట్
X
టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డిపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయ్యింది. తనపై నమోదైన కేసుకు సంబంధించి ప్రతిపాడులోని మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్.‌బి.డబ్ల్యు) జారీ చేసింది.

ఇది చాలా కాలంగా కోర్టులో న‌లుగుతున్న పాత‌ కేసు. అంగీకరించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వనందుకు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ‌ పంపిణీదారుడు మిరియాల‌పై కేసు నమోదు చేశారు. నాగ చైతన్య నటించిన `సాహాసమే శ్వాస‌గా సాగిపో` ను కూడా గ‌తంలో మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించారు. ఆ సినిమాకి సంబంధించిన పంపిణీ ఆర్థిక వ్య‌వ‌హారాల్లో.. అతను అమెరికా పంపిణీదారునికి డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. అందువల్ల మిరియాలా రవీందర్ రెడ్డిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి 2021 ఏప్రిల్ 19 న కోర్టుకు హాజరుపరచాలని కోర్టు పోలీసులను కోరింది.

ప్ర‌స్తుతం న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు బీబీ 3 సినిమాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకోసం మిరియాల అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చించార‌ని టాక్ వినిపిస్తోంది.