Begin typing your search above and press return to search.

'అయ్యప్పనమ్ కోషియమ్' రీమేక్ లోకి మరో డస్కీ బ్యూటీ..?

By:  Tupaki Desk   |   1 Dec 2020 11:00 AM GMT
అయ్యప్పనమ్ కోషియమ్ రీమేక్ లోకి మరో డస్కీ బ్యూటీ..?
X
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. బిజూ మీనన్ - పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా హీరోలుగా నటించనున్నారు. బిజూ మీనన్ పోషించిన నిజాయితీగల పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో పవన్‌ కనిపించనుండగా.. అతనికి ధీటుగా నిలిచే పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇందులో పవన్ - రానా లకు భార్య పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. నిడివి తక్కువైనా ఈ పాత్రలకు కథలో ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో రానా కి జోడీగా నివేథా పేతురాజ్ ని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

'మెంటల్ మదిలో' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన డస్కీ బ్యూటీ నివేత.. 'చిత్ర లహరి' 'బ్రోచేవారేవరురా' వంటి సినిమాలలో అలరించింది. ఇక అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ లో వస్తున్న 'అయ్యప్పనుమ్ కొశియుమ్' లో కూడా నివేథా ఛాన్స్ దక్కించుకుందని అంటున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా ఐశ్వ‌ర్య రాజేష్ ని తీసుకున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ ప్రాజెక్ట్ లోకి మరో డస్కీ బ్యూటీ వ‌చ్చిన‌ట్లు అవుతుంది. ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.