Begin typing your search above and press return to search.

ఏకే రీమేక్ః ప‌వ‌న్ హీరోయిన్ గా బొద్దుగుమ్మ ఫిక్స్‌?

By:  Tupaki Desk   |   25 March 2021 5:38 AM GMT
ఏకే రీమేక్ః ప‌వ‌న్ హీరోయిన్ గా బొద్దుగుమ్మ ఫిక్స్‌?
X
తెలుగులో తెర‌కెక్కు‌తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్టుల‌లో ‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియం’ రీమేక్ ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - భళ్లాల దేవ రానా కాంబోలో రూపొందుతున్న ఈ మూవీపై హై-ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. జ‌న‌వ‌రి నుంచి మొద‌లైన ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది.

ఈ చిత్రంలో బిజు మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నారు. మరో హీరో పృథ్వీరాజ్‌ క్యారెక్టర్ లో ప్రతినాయక పాత్ర పోషించనున్నాడు రానా. వీరిద్ద‌రూ ఢీకొనే స‌న్నివేశాల కోసం ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ల‌ను ఫైన‌ల్ చేయ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఎట్ట‌కేల‌కు రానాకు జోడీ కుదిరిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ కు మాత్రం ఇంకా సెట్ కాలేదు. రానా స‌ర‌స‌న త‌మిళ్ బ్యూటీ ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తుండ‌డం క‌న్ఫామ్ అయ్యింది. ప‌వ‌న్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌విని అనుకున్న‌ప్ప‌టికీ.. డేట్స్ అడ్జెస్ట్ కాక‌పోవ‌డంతో ఆమె త‌ప్పుకుంది. దీంతో యూనిట్ వేట మొద‌లు పెట్టింది.

చివ‌ర‌కు త‌మ స్పాట్ లైట్ ను ఒక‌రిపై ఆపింది చిత్ర బృందం. ఆ బ్యూటీ మ‌రెవ‌రో కాదు నిత్యామీన‌న్‌. తెలుగులో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించిన నిత్యామీన‌న్ ను ప‌వ‌న్ కు జోడీగా సెల‌క్ట్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. నిత్యా కూడా ఓకే చెప్పింద‌ట‌. కానీ.. అగ్రిమెంట్ పై ఇంకా సంత‌కం చేయ‌లేద‌ని టాక్‌. మ‌రి, ఆమె ఓకే అవుతుందా? మ‌ళ్లీ సెర్చింగ్ కంటిన్యూ అవుతుందా? అన్న‌ది చూడాలి.

ఈ క్రేజీ మల్టీస్టారర్ కు.. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. మాటలు, స్క్రీన్ ప్లే రైటింగ్ బాధ్యతను మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకున్నారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.