Begin typing your search above and press return to search.

'సరిలేరు నీకెవ్వరు' నుండి ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌

By:  Tupaki Desk   |   21 Oct 2019 6:25 AM GMT
సరిలేరు నీకెవ్వరు నుండి ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌
X
మహేష్‌ బాబు 26వ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వచ్చే నెలలో షూటింగ్‌ ను పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ఈ చిత్రంకు సంబంధించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోస్‌ 7 ఎకరాల్లో వేసిన భారీ సెట్టింగ్‌ లో చిత్రీకరించారు. ప్రకాష్‌ రాజ్‌ ఇంటి సెట్‌ ను అక్కడ రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మించి యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నట్లుగా తెలియజేశాం. ఇప్పుడు ఆ యాక్షన్‌ సీన్స్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా తెలియజేశారు.

తాజా షెడ్యూల్‌ పూర్తి అవ్వడంతో చివరి షెడ్యూల్‌ కు రెడీ అవుతున్నట్లుగా ప్రకటించారు. ఇదే సమయంలో దీపావళికి ఒక ట్రీట్‌ ఇవ్వబోతున్నట్లుగా కూడా అధికారిక ప్రకటన వచ్చింది. దీపావళికి ఈ చిత్రం మరో టీజర్‌ విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. టీజర్‌ లేదంటే మొదటి పాటను విడుదల చేస్తారేమో చూడాలి. మొత్తానికి దీపావళికి మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కు పండుగ స్పెషల్‌ గా ట్రీట్‌ అయితే ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. అదేంటి అనేది ఒకటి రెండు రోజుల్లో తెలియనుంది.

మహేష్‌ బాబుకు జోడీగా ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తుండగా ఈ చిత్రంతో నటిగా విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అలాగే నిర్మాతగా మారిన నటుడు బండ్ల గణేష్‌ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ అందిస్తున్న సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఎఫ్‌ 2 తో గత సంక్రాంతి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనీల్‌ రావిపూడి ఈ చిత్రంతో మరో సక్సెస్‌ ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.