Begin typing your search above and press return to search.

టిష్యూ పేపర్లు కొనమని అడిగితే.. రూ.2వేల నోట్లు ఇచ్చిన ఫేమస్ సింగర్

By:  Tupaki Desk   |   18 Feb 2020 7:15 AM GMT
టిష్యూ పేపర్లు కొనమని అడిగితే.. రూ.2వేల నోట్లు ఇచ్చిన ఫేమస్ సింగర్
X
మనసు అందరికి ఉన్నా.. కొందరు చేసే పనులు హార్ట్ టచింగ్ గా ఉంటాయి. తాజాగా తాను చేసిన పనితో మనసు దోచేశారు బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్. ఆమె పాటలు ఎంత ఫేమస్సో.. ఆయనకున్న అభిమానగణాన్ని చూస్తే అర్థమైపోతుంది. దీనికి తోడు ఆమెకు సంబంధించిన వార్తలు తరచూ మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వస్తుంటాయి. ఇప్పుడామె పెళ్లి విషయం మీద సాగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ప్రఖ్యాత సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడ్ని ఆమె పెళ్లాడనున్నట్లుగా వార్తలు వచ్చినా.. అవేమీ నిజం కాదని ఆమె ఖండించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని బయటకు వచ్చిన ఆమెతో సెల్పీలు దిగేందుకు పలువురు ఆసక్తిని ప్రదర్శించారు. వారితో సెల్పీలు దిగుతున్న వేళ.. ఇద్దరు చిన్నారులు ఆమె వద్దకు వచ్చి.. టిష్యూ పేపర్లు కొనాలని కోరారు.

వారిని చూసి ముచ్చట పడిన ఆమె.. తన బ్యాగులో నుంచి ఒక్కొక్కరికి రూ.2వేల నోటును ఇచ్చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. దీనికి సంబంధించిన పొట్టి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమెది బంగారం లాంటి మనసు అంటూ పొగిడేస్తున్నారు కొందరు.

మరికొందరేమో.. తియ్యటి గొంతే కాదు.. అందమైన మనసు ఆమెది. పిల్లలు వచ్చి అడిగినంతనే వారిపై చిరాకు పడకుండా..ఎలాంటి సంకోచం లేకుండా రూ.2వేల నోట్లు ఇచ్చి సాయం చేసిందంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. వీధి బాలల విషయంలో ఆమె ప్రదర్శించిన ఉదారత ఇప్పుడామె ఇమేజ్ ను మరింత పెంచేలా చేసింది.