Begin typing your search above and press return to search.

మల్టీస్టారర్‌ లో జాయిన్ అయిన శాకుంతలం

By:  Tupaki Desk   |   17 Aug 2021 9:30 AM GMT
మల్టీస్టారర్‌ లో జాయిన్ అయిన శాకుంతలం
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇటీవల 'శాకుంతలం' సినిమా షూటింగ్ ను ముగించేసింది. దర్శకుడు గుణశేఖర్ ఆశ్చర్యకరంగా శాకుంతలం సినిమాను చాలా తక్కువ సమయంలోనే ముగించేశాడు. సహజంగా అయితే ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకునే గుణశేఖర్‌ ఈసారి మాత్రం చాలా తక్కువ సమయంలోనే సినిమా షూటింగ్ ను ముగించాడు. గుణశేఖర్‌ సినిమా శాకుంతలం ముగియడంతో సమంత తదుపరి సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యేందుకు గాను పాండీచెరి వెళ్లింది. అక్కడ విజయ్‌ సేతుపతి మరియు నయనతారలతో కలిసి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో కాతు వాకుల రెండు కాదల్ సినిమా షూటింగ్‌ లో జాయిన్ అయినట్లుగా సమాచారం అందుతోంది.

ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీతో మల్టీ స్టారర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత మొదలు పెట్టినా కూడా హీరోయిన్స్ ఇద్దరు ఇతర ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉండటం మరియు ఇతర కారణాల వల్ల సినిమా చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు అయినా సినిమా షూటింగ్‌ ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌ తో సినిమా షూటింగ్‌ పూర్తి అవుతుందని సమాచారం అందుతోంది. సినిమాకు సంబంధించినంత వరకు సమంత పాత్ర చాలా కీలకంగా ఉంటుందని.. ఆమె పాత్ర చుట్టు కథ తిరుగుతుందని.. కాస్త బోల్డ్‌ గా కూడా ఉంటుందని అంటున్నారు.

నయనతార మరియు సమంతలు ఈ సినిమాలో పోటీ పడి మరీ నటించబోతున్నట్లుగా చెబుతున్నారు. సూపర్‌ డీలక్స్ సినిమాలో అత్యంత విభిన్నమైన పాత్రను చేసిన సమంత ఈమద్య కాలంలో అన్ని కూడా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు.. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తోంది. కనుక ఈ సినిమాలో కూడా సమంత పాత్ర మరియు ఆమె నటన ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంతో అంటున్నారు. ఈ సినిమా తో విఘ్నేష్‌ శివన్‌ ఒక చక్కని ప్రేమ కథను చూపించబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల వారు చెబుతున్నారు. నయన్‌ ప్రియుడు అయిన విఘ్నేష్‌ శివన్ ఒక వైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే మరో వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూ ఉన్నాడు.