Begin typing your search above and press return to search.
దసరాతో మాలీవుడ్ లో నానీకి క్రేజ్?
By: Tupaki Desk | 22 Jan 2022 7:30 AM GMTమల్లు అర్జున్ గా మాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు అల్లు అర్జున్. అతడి సినిమా వస్తోంది అంటే మోహన్ లాల్ .. మమ్ముట్టి లాంటి స్టార్లకు సైతం తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నారు. దేవుడు నడియాడే గడ్డపై అంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నాడు బన్ని.
ఆ తర్వాత మన స్టార్లంతా మాలీవుడ్ లో సత్తా చాటేందుకు ఎవరికి వారు ప్రత్నిస్తున్నారు. అక్కడ కూడా పెద్ద మార్కెట్ ని సంపాదించుకోవాలనే తహతహ ప్రణాళికల్లో కనిపిస్తోంది. ప్రభాస్ .. రానా లాంటి స్టార్లకు ఇప్పుడు మాలీవుడ్ లో ఫాలోయింగ్ ఉంది. తదుపరి నేచురల్ స్టార్ నాని కూడా మాలీవుడ్ మార్కెట్లో గ్రిప్ పెంచుకోవాలన్న తపనతో ఉన్నాడు.
నాని నటిస్తున్న తదుపరి చిత్రం దసరాలో ఓ మాలీవుడ్ యువనటుడు కీలక పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. యువ చిత్రనిర్మాత శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్నారు. పల్లెటూరి తెలంగాణా డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నాని నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. తాజా సమాచారం మేరకు.. మలయాళ యువనటుడు రోషన్ మాథ్యూ ఇందులో కీలక పాత్రను పోషించనున్నారు. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో అత్యంత ప్రామిసింగ్ యువ నటుల్లో రోషన్ మాథ్యూ ఒకరు. రోషన్ ఈ చిత్రంలో నాని స్నేహితుడిగా కనిపించనున్నాడు. అతని పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చిత్రంలో రోషన్ కూడా నాని లాగా రగ్గడ్ గెటప్ లో కనిపించనున్నాడు. నాని ఈ చిత్రం కోసం తెలంగాణ యాస భాషను నేర్చుకుంటున్నాడు.
ఇటీవల విడుదలైన దసరా మోషన్ పోస్టర్ ఉత్కంఠను పెంచిన సంగతి తెలిసిందే. వీ చిత్రం తర్వాత మరోసారి నానీ నెగెటివ్ రోల్ ని పోషిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని- సాయి కుమార్ -జరీనా వాహబ్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేయనున్నారు.
రోషన్ మాథ్యూ 2015లో విడుదలైన మలయాళ చిత్రం `ఆది కప్యారే కూటమణి`తో కెరీర్ ని ప్రారంభించాడు. తదుపరి `ఆనందం` అనే చిత్రంతో పేరొచ్చింది. మూథోన్ తో హిందీలో కూడా అడుగుపెట్టాడు. అనురాగ్ కశ్యప్ `చోక్డ్`లో నటించాడు. ఈ ఏడాది తమిళ చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టనున్నాడు. తెలుగులో నేచురల్ స్టార్ తో కలిసి రంగ ప్రవేశం చేస్తుండడం ఆసక్తికరం. పృథ్వీరాజ్- ఫహద్ ఫాజిల్ తరహాలోనే మాథ్యూస్ కి కూడా ఇక్కడ పేరొస్తుందనే భావిస్తున్నారు.
ఆ తర్వాత మన స్టార్లంతా మాలీవుడ్ లో సత్తా చాటేందుకు ఎవరికి వారు ప్రత్నిస్తున్నారు. అక్కడ కూడా పెద్ద మార్కెట్ ని సంపాదించుకోవాలనే తహతహ ప్రణాళికల్లో కనిపిస్తోంది. ప్రభాస్ .. రానా లాంటి స్టార్లకు ఇప్పుడు మాలీవుడ్ లో ఫాలోయింగ్ ఉంది. తదుపరి నేచురల్ స్టార్ నాని కూడా మాలీవుడ్ మార్కెట్లో గ్రిప్ పెంచుకోవాలన్న తపనతో ఉన్నాడు.
నాని నటిస్తున్న తదుపరి చిత్రం దసరాలో ఓ మాలీవుడ్ యువనటుడు కీలక పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. యువ చిత్రనిర్మాత శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్నారు. పల్లెటూరి తెలంగాణా డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నాని నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. తాజా సమాచారం మేరకు.. మలయాళ యువనటుడు రోషన్ మాథ్యూ ఇందులో కీలక పాత్రను పోషించనున్నారు. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో అత్యంత ప్రామిసింగ్ యువ నటుల్లో రోషన్ మాథ్యూ ఒకరు. రోషన్ ఈ చిత్రంలో నాని స్నేహితుడిగా కనిపించనున్నాడు. అతని పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చిత్రంలో రోషన్ కూడా నాని లాగా రగ్గడ్ గెటప్ లో కనిపించనున్నాడు. నాని ఈ చిత్రం కోసం తెలంగాణ యాస భాషను నేర్చుకుంటున్నాడు.
ఇటీవల విడుదలైన దసరా మోషన్ పోస్టర్ ఉత్కంఠను పెంచిన సంగతి తెలిసిందే. వీ చిత్రం తర్వాత మరోసారి నానీ నెగెటివ్ రోల్ ని పోషిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని- సాయి కుమార్ -జరీనా వాహబ్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేయనున్నారు.
రోషన్ మాథ్యూ 2015లో విడుదలైన మలయాళ చిత్రం `ఆది కప్యారే కూటమణి`తో కెరీర్ ని ప్రారంభించాడు. తదుపరి `ఆనందం` అనే చిత్రంతో పేరొచ్చింది. మూథోన్ తో హిందీలో కూడా అడుగుపెట్టాడు. అనురాగ్ కశ్యప్ `చోక్డ్`లో నటించాడు. ఈ ఏడాది తమిళ చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టనున్నాడు. తెలుగులో నేచురల్ స్టార్ తో కలిసి రంగ ప్రవేశం చేస్తుండడం ఆసక్తికరం. పృథ్వీరాజ్- ఫహద్ ఫాజిల్ తరహాలోనే మాథ్యూస్ కి కూడా ఇక్కడ పేరొస్తుందనే భావిస్తున్నారు.