Begin typing your search above and press return to search.

బాలయ్య సెకండ్ గెస్ట్‌ శ్యామ్‌ సింగ రాయ్‌

By:  Tupaki Desk   |   8 Nov 2021 1:00 PM GMT
బాలయ్య సెకండ్ గెస్ట్‌ శ్యామ్‌ సింగ రాయ్‌
X
తెలుగు ఓటీటీ ఆహా లో స్ట్రీమింగ్‌ అవుతున్న బాలయ్య అన్‌ స్టాపబుల్‌ కు మంచి రెస్పాన్స్ దక్కంది. మొదటి ఎపిసోడ్‌ మోహన్ బాబుతో సాగింది. బాలయ్య మరియు మోహన్‌ బాబుల మద్య సాగిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. బాలయ్య ఎలా హోస్ట్‌ గా చేస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అందరిలో ఉన్న అనుమానాలకు తెర దించుతూ ఆకట్టుకునే విధంగా బాలయ్య హోస్టింగ్‌ చేశాడు. చాలా సింపుల్‌ గా నాచురల్‌ గా బాలకృష్ణ టాక్ షో ను చేశాడు. అక్కడక్కడ చిన్న పాటి తనదైన శైలి సైగలు మరియు డైలాగ్స్ తో మొదటి ఎపిసోడ్‌ ను అలా అలా లాగించేశాడు. ఇక సెకండ్ ఎపిసోడ్‌ ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఆహా సమాధానం ఇచ్చింది. బాలయ్య ఆహా టాక్ షో అన్‌ స్టాపబుల్‌ లో సెండ్‌ గెస్ట్‌ గా శ్యామ్‌ సింగ రాయ్ హీరో నాని ని తీసుకు రాబోతున్నారు.

జనం నుండి వచ్చిన హీరో అంటూ నానిని బాలయ్య స్టేజ్ పైకి ఆహ్వానించి చాలా సరదాగా ప్రశ్నలతో.. ఆటలతో షో ను నడిపించాడు. నాని మరియు బాలయ్యల మద్య సాగిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగాయని ప్రోమో చూస్తుంటేనే అర్థం అవుతోంది. నాని నుండి పలు విషయాలను రాబట్టిన బాలయ్య ఇండస్ట్రీలో టక్ జగదీష్‌ విడుదల సమయంలో తాను ఎదుర్కొన్న విషయాల గురించి కూడా చర్చించాడు. మొత్తానికి నానితో బాలయ్య టాక్ షో ఓ రేంజ్ ఎంటర్‌ టైన్ మెంట్‌న ఉ అందించబోతుందని ప్రోమో చూస్తుంటే చాలా నమ్మకంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు సరదాగా స్టేజ్ పై క్రికెట్‌ ఆడటంతో పాటు డైలాగ్స్ చెప్పుకున్నారు.. చిన్న చిన్న పాటలు కూడా పాడుకున్నారు.

ఒకరిపై ఒకరు పంచ్‌ లు వేసుకుంటూ సరదాగా అన్‌ స్టాపబుల్‌ అంటూ షో ను సాగించారు. మోహన్‌ బాబు ఎపిసోడ్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో నాని ఎపిసోడ్‌ కు అంతకు మించిన స్పందన దక్కుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు. నాని శ్యామ్‌ సింగ రాయ్‌ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్ ను కూడా అన్‌ స్టాపబుల్‌ లో చేయబోతున్నారు. నాని ద్విపాత్రాభినయం చేసిన శ్యామ్ సింగరాయ్ లో సాయి పల్లవి.. కృతి శెట్టి మరియు మడోనా సెబాస్టియన్‌ లు నటించారు. థియేటర్ రిలీజ్ కు సిద్దంగా ఉన్న నాని ఈ సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నాడు. గత రెండు సినిమాలు ఓటీటీ ద్వారా డైరెక్ట్ రిలీజ్ అవ్వడం వల్ల బయ్యర్లు ఆయనపై కాస్త కోపంతో ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని వారికి లాభాలు వస్తే వారు మళ్లీ నార్మల్ అవుతారేమో చూడాలి.