Begin typing your search above and press return to search.

నానితో మళ్లీ మైత్రి కుదిరింది

By:  Tupaki Desk   |   12 Nov 2020 12:30 PM GMT
నానితో మళ్లీ మైత్రి కుదిరింది
X
యంగ్‌ హీరో నాని.. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో ఇప్పటికే 'గ్యాంగ్‌ లీడర్‌' సినిమా చేసిన విషయం తెల్సిందే. ఈ కాంబోలో మరో సినిమాను చేయబోతున్నారు. ప్రస్తుతం నాని చేస్తున్న టక్‌ జగదీష్‌ మరియు శ్యామ్‌ సింగరాయ్‌ లు పూర్తి అయిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్‌ లో సినిమా మొదలు అవ్వబోతుంది. మైత్రి మూవీస్‌ వారు ఈ విషయాన్ని రేపు అధికారికంగా ప్రకటించబోతున్నారు. దీపావళి సందర్బంగా నాని మైత్రి మూవీ మేకర్స్‌ ల కాంబో దర్శకుడు ఎవరు అనే విషయమై క్లారిటీ ఇవ్వబోతున్నారు.

రేపు మంచి రోజు అంటా.. రేపు మాట్లాడుకుందాం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నాని28 సినిమాను అధికారింగా అనౌన్స్‌ చేశారు. మైత్రి మూవీ మేకర్స్‌ లో ఇప్పటికే పలు సినిమాలను మైత్రి వారు నిర్మిస్తున్నారు. ప్రముఖ హీరోలతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో నానితో మరో సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. నవీన్‌ యెర్నేని.. రవి శంకర్‌ యెలమంచిలు కలిసి నిర్మిస్తున్న నాని28 సినిమా రేపు దీపావళి సందర్బంగా అనౌన్స్‌ చేయబోతున్న నేపథ్యంలో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.