Begin typing your search above and press return to search.

బాలకృష్ణనే మోసం చేయాలనుకుంటావా?

By:  Tupaki Desk   |   18 Feb 2020 6:30 AM GMT
బాలకృష్ణనే మోసం చేయాలనుకుంటావా?
X
సినీనటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకం ఫోర్జరీ కేసులో ఎట్టకేలకు నిందితుడు పట్టుబడ్డాడు. సొంత సంస్థలోనే పని చేస్తున్న అకౌంటెంట్ ఈ పనికి పాల్పడ్డాడు. దీంతో అతడిని సోమవారం అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. బాలకృష్ణ ఇటీవల సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఎన్బీకే క్రియేషన్స్ అని బ్యానర్ ఏర్పాటుచేశాడు. ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ లో ఉంది. ఈ కార్యాలయంలో అకౌంటెంట్ గా కొర్రి శివ పని చేస్తున్నాడు.

అయితే బాలకృష్ణ సతీమణి వసుంధర కు బంజారాహిల్స్ లోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఖాతా ఉంది. అయితే ఈ ఖాతా నుంచి ఆన్ లైన్ బ్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారా అని బ్యాంక్ అధికారులు వారిని సంప్రదించారు. ఈ నేపథ్యంలో వసుంధరతో పాటు సీనియర్ అకౌంటెంట్ సుబ్బారావు కూడా తాము దరఖాస్తు చేయలేదని చెప్పారు. మొబైల్ బ్యాంకింగ్ కోసం తాము దరఖాస్తు చేయలేదని స్పష్టం చేయడం తో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో సంస్థ అకౌంటెంట్ శివ ఈ పనికి పాల్పడ్డట్టు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అతడిని రిమాండ్ కు తరలించిన ఇన్ స్పెక్టర్ సత్తయ్య తెలిపారు.

అయితే బాలకృష్ణ సంస్థ ప్రారంభించిన ఎన్బీకే క్రియేషన్స్ వ్యవహారాలు ఆయన భార్య వసుంధర చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు అవసరాల కోసం సంతకాలు చేస్తుంటారు. ఆ క్రమంలో అకౌంటెంట్ ఆమె సంతకం చూసి ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముందే వీఐపీలు కావడంతో వెంటనే బ్యాంక్ అధికారులు, పోలీసులు స్పందించి చర్యలు తీసుకున్నారు. అదే సామాన్య ప్రజానీకం అయితే ఇంత త్వరగా స్పందించే అవకాశం ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయినా బాలకృష్ణ నే మోసం చేయాలనుకుంటా వారినీ అంటున్నారు.