Begin typing your search above and press return to search.

నందమూరి అభిమానులా మజాకా

By:  Tupaki Desk   |   19 Oct 2015 10:40 AM GMT
నందమూరి అభిమానులా మజాకా
X
అభిమానులందు నందమూరి అభిమానులు వేరయా అనుకోవాల్సి ఉంటుంది. హీరోల్ని అభిమానించే విషయంలో తమ తర్వాతే ఎవ్వరైనా అని చాటుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు. మామూలుగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైనపుడు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో, యుఎస్ లో టికెట్ల వేలం పాటలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నందమూరి హీరోల సినిమాలు విడుదలైనపుడు ఈ వేలం పాటలు ఎక్కడికో వెళ్లిపోతుంటాయి. ‘ఒక్క మగాడు’ సినిమాకు అనంతపురానికి చెందిన ఓ అభిమాని రూ.36 వేలు పెట్టి టికెట్ కొనడం అప్పట్లో పెద్ద సంచలనం. నందమూరి అభిమానుల విషయంలో ఇలాంటి ఉదంతాలు ఇంకా చాలానే ఉన్నాయి.

ఈ మధ్యే ఎన్టీఆర్ కోసం అనంతపురం జిల్లాకు చెందిన అభిమానులే రూ.35 లక్షల విలువైన చీర బహుమతిగా ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. ఐతే అవన్నీ వ్యక్తిగత వ్యవహారాలు కాబట్టి పక్కనబెట్టేద్దాం. ఇప్పుడో ప్రజాపయోగ కార్యక్రమం కోసం నందమూరి అభిమానులు పెద్ద సాహసమే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కోసం ఇటుకలు విరాళంగా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ద్వారా ఇటుకను కొనుగోలు చేసి విరాళంగా ఇస్తున్నారు జనాలు. ఇందులో భాగంగా ‘ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్’ తరఫున నందమూరి అభిమానులు బాలయ్య తరఫున లక్ష ఇటుకలు అమరావతికి విరాళంగా ఇస్తున్నారు. ఆ ఇటుకలపై జై బాలయ్య అన్న ముద్ర కూడా వేస్తుండటం విశేషం.