Begin typing your search above and press return to search.
బాబాయ్- అబ్బాయ్ ఈవెంట్లో చిరంజీవి?
By: Tupaki Desk | 6 Jun 2020 4:00 AM GMTనందమూరి కుటుంబంలో డివైడ్ టాపిక్ అభిమానుల్లో నిరంతరం సాగేదే. నటసింహా బాలకృష్ణ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య మరీ అంత సఖ్యత లేదని ప్రచారం సాగింది. అప్పట్లో పలు వేదికలపైనా ఫ్యాన్స్ సమక్షంలో దీనిపై బ్రదర్స్ కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ ఎమోషన్ అయిన సంగతి తెలిసిందే. అయితే కాలక్రమంలో మేమంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశారు. బాబాయ్ పై తమ ప్రేమను ఆ ఇద్దరూ పదే పదే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే బాబాయ్ సైతం అబ్బాయ్ ఎన్టీఆర్ ని కలుపుకోవడం ఒకే వేదికపై ఒకే ఫ్రేములో కనిపించడంతో ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యలు క్లియర్ అయ్యాయని క్లారిటీ వచ్చింది. అదంతా గతం అనుకుంటే వర్తమానంలో బాబాయ్ అబ్బాయ్ అలయెన్స్ సంగతేమిటి? అంటే...
జూన్ 10న ఫ్యాన్స్ సమక్షంలో జరగనున్న బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో మరింత క్లారిటీ వచ్చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఈసారి పుట్టిన రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అది బాలయ్య షష్ఠిపూర్తి కావడంతో ఈవెంట్ ని ఘనంగా ప్లాన్ చేస్తోంది నందమూరి కుటుంబం. ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. తొలిగా బాలయ్య తన నివాసంలో ఓ భారీ విందు ఏర్పాటు చేయనున్నారని ఈ విందులో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొంటారని లీకులందాయి.
ఈ వేడుకలో అబ్బాయ్ ఎన్టీఆర్ .. అతడి సోదరుడు కళ్యాణ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని సమాచారం. ఆ ఇరువురు బాబాయ్ కి అరుదైన కానుకను అందిస్తారని ఫ్యాన్స్ లో ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక వీళ్లతో పాటు పరిశ్రమ తరపున పెద్దగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల వివాదం నేపథ్యంలో తమ మధ్య ఎలాంటి భేషజాలు లేవని చెప్పేందుకు బాలయ్య స్వయంగా చిరుని ఆహ్వానిస్తారని ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. మరి ఏం జరగనుంది? ఒకే ఫ్రేములో ఆ ముగ్గురు దిగ్గజాలు కనిపిస్తారా? లేదా..? అన్నది చూడాలి.
జూన్ 10న ఫ్యాన్స్ సమక్షంలో జరగనున్న బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో మరింత క్లారిటీ వచ్చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఈసారి పుట్టిన రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అది బాలయ్య షష్ఠిపూర్తి కావడంతో ఈవెంట్ ని ఘనంగా ప్లాన్ చేస్తోంది నందమూరి కుటుంబం. ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. తొలిగా బాలయ్య తన నివాసంలో ఓ భారీ విందు ఏర్పాటు చేయనున్నారని ఈ విందులో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొంటారని లీకులందాయి.
ఈ వేడుకలో అబ్బాయ్ ఎన్టీఆర్ .. అతడి సోదరుడు కళ్యాణ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని సమాచారం. ఆ ఇరువురు బాబాయ్ కి అరుదైన కానుకను అందిస్తారని ఫ్యాన్స్ లో ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక వీళ్లతో పాటు పరిశ్రమ తరపున పెద్దగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల వివాదం నేపథ్యంలో తమ మధ్య ఎలాంటి భేషజాలు లేవని చెప్పేందుకు బాలయ్య స్వయంగా చిరుని ఆహ్వానిస్తారని ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. మరి ఏం జరగనుంది? ఒకే ఫ్రేములో ఆ ముగ్గురు దిగ్గజాలు కనిపిస్తారా? లేదా..? అన్నది చూడాలి.