Begin typing your search above and press return to search.

చెప్పడం ఇష్టం లేదని చెప్పిన నమ్రత

By:  Tupaki Desk   |   1 July 2020 1:30 PM GMT
చెప్పడం ఇష్టం లేదని చెప్పిన నమ్రత
X
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమె మహేష్ తో పాటు తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఇటీవల ఈమె సోషల్ మీడియా ద్వారా లైవ్ లోకి వచ్చింది. ఆ సందర్భంగా పలు విషయాలు గురించి స్పందించింది.

మహేష్ బాబు తో తన ప్రేమ విషయాన్ని గురించి మాట్లాడిన నమ్రత అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చింది. మహేష్ గురించి అభిమానులు అడిగిన విషయాలపై మాట్లాడింది. ఇదే సమయంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె చేతికి ఉండే టాటూ గురించి స్పందించింది.

ఆ విషయంలో నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. తన పిల్లలు తన ఫ్యామిలీ గురించి గొప్పగా మాట్లాడటం ఇష్టం ఉండదు అంది. నా జీవితంలో చాలా ముఖ్యమైన వారి పేర్లను టాటూ గా వేయించినట్లుగా చెప్పింది. మాజీ మిస్ ఇండియా అయిన నమ్రత కుటుంబం కోసం ఎంత ప్రముఖ్య ఇస్తుందో ఆవిడ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.