Begin typing your search above and press return to search.

స్పీడ్ పెరిగిందిగా బుజ్జి! బట్ జాగ్రత్త

By:  Tupaki Desk   |   7 Sep 2016 5:30 PM GMT
స్పీడ్ పెరిగిందిగా బుజ్జి! బట్ జాగ్రత్త
X
నల్లమలపు బుజ్జి ఇప్పడు బాగా బిజీ ప్రొడ్యూసర్ అయిపోతున్నారు. వరుసగా సినిమాలు చేస్తుండడం ఒకటైతే.. ఒకేసారి పలు ప్రాజెక్టులు హ్యాండిల్ చేసే రేంజ్ కి చేరిపోయారీయన. పైగా ఇవేవీ లోబడ్జెట్ సినిమాలు కాకపోవడం.. క్రేజీ కాంబినేషన్లతో తెరకెక్కే సినిమాలే కావడం గమనించాల్సిన విషయం.

శ్రీనువైట్ల - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మిస్టర్ కు ఒక ప్రొడ్యూసర్ గా నల్లమలుపు బుజ్జి వ్యవహరిస్తున్నారు. ఇక సాయిధరం తేజ్- గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందనున్న విన్నర్ కు కూడా ఈయన ఓ నిర్మాత. ఇప్పుడు రవితేజతో విక్రమ్ శిరి తెరకెక్కించే మూవీని కూడా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్.. సాయిధరం తేజ్ ల సినిమాలు సెట్స్ పై ఉండగా.. రవితేజ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఇలా ఒకేసారి మూడు సినిమాలు నిర్మించడం పెద్ద రిస్క్ అంటున్నారు సినీ జనాలు.

గతంలో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఇలాంటి ప్రయత్నాలే చేసింది. తెలుగుతో పాటు హాలీవుడ్ (ఆహ్వానం మూవీని ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే డైవోర్స్ ఇన్విటేషన్ గా తీశారు) లో కూడా ఎటెంప్ట్ చేసేశారు. బెల్లంకొండ సురేష్ కూడా ఇలాగే మల్టిపుల్ ప్రాజెక్టులు హ్యండిల్ చేసి చేతులు కాల్చుకున్నారు. యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాలది కూడా సేమ్ స్టోరీ. ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జికి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని ఫిలింనగర్ జనాలు సూచిస్తున్నారు .