Begin typing your search above and press return to search.
SSMB 28 రూమర్స్.. నిర్మాత అస్సలు ఆగట్లే!
By: Tupaki Desk | 27 April 2023 2:53 PM GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి అవ్వగా, ఇంకా కొన్ని షెడ్యూల్స్ పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిందని , మహేష్ - త్రివిక్రమ్ కు మధ్య విభేదాలు వచ్చాయని , అందుకే సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందని సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం జరుగుతుంది.
ఈ ప్రచారాలు జోరందుకోవడంతో, వాటిని ఖండించడానికి నిర్మాతలు రంగంలోకి దిగారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదిగా ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అలాంటిదేమీ లేదని, అంతా సవ్యంగానే జరుగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు
'తిండి కోసం అన్వేషించే పక్షులు గట్టిగా శబ్దం చేస్తాయి. అలాగే ఎవరైనా తమ అటెన్షన్ కోసం ట్రై చేసేటప్పుడు గాసిప్స్ను స్ప్రెడ్ చేస్తారు. వాటిని చూసి నవ్వుకోవడం లేదంటే పట్టించుకుండా వదిలేయాలి. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలి.
సూపర్ ఫ్యాన్స్… SSMB 28 సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. మీరు వినాలనుకునేది వినండి. కానీ, ఈ స్టేట్మెంట్ గుర్తు పెట్టుకోండి. ఈ గాసిప్ రాయుళ్లు రాసే వార్తల ప్రకారం సినిమాలను చేస్తే మూవీ ఇండస్ట్రీకి ఉపయోగకరంగా ఉంటుందేమో. SSMB 28 డెఫనెట్ గా బ్లాక్ బస్టర్ హిట్. ఇది మా మాటగా గుర్తు పెట్టుకోండి' అంటూ ట్వీట్ చేశారు.
తాజాగా, మరో ట్వీట్ చేశారు. 'ఈ గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించడానికి బదులు, సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి లాభం చేకూరుతుంది. #SSMB28 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాము.' అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. ప్రశాంతంగా పని చేయాలని అనుకుంటున్నామని పేర్కొన్నాడు.
ఈ సినిమా కచ్చితంగా 2024లో విడుదలౌతుంది గుర్తుంచుకోండి అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా తర్వాత, మహేష్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.
ఈ ప్రచారాలు జోరందుకోవడంతో, వాటిని ఖండించడానికి నిర్మాతలు రంగంలోకి దిగారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదిగా ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అలాంటిదేమీ లేదని, అంతా సవ్యంగానే జరుగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు
'తిండి కోసం అన్వేషించే పక్షులు గట్టిగా శబ్దం చేస్తాయి. అలాగే ఎవరైనా తమ అటెన్షన్ కోసం ట్రై చేసేటప్పుడు గాసిప్స్ను స్ప్రెడ్ చేస్తారు. వాటిని చూసి నవ్వుకోవడం లేదంటే పట్టించుకుండా వదిలేయాలి. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలి.
సూపర్ ఫ్యాన్స్… SSMB 28 సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. మీరు వినాలనుకునేది వినండి. కానీ, ఈ స్టేట్మెంట్ గుర్తు పెట్టుకోండి. ఈ గాసిప్ రాయుళ్లు రాసే వార్తల ప్రకారం సినిమాలను చేస్తే మూవీ ఇండస్ట్రీకి ఉపయోగకరంగా ఉంటుందేమో. SSMB 28 డెఫనెట్ గా బ్లాక్ బస్టర్ హిట్. ఇది మా మాటగా గుర్తు పెట్టుకోండి' అంటూ ట్వీట్ చేశారు.
తాజాగా, మరో ట్వీట్ చేశారు. 'ఈ గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించడానికి బదులు, సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి లాభం చేకూరుతుంది. #SSMB28 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాము.' అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. ప్రశాంతంగా పని చేయాలని అనుకుంటున్నామని పేర్కొన్నాడు.
ఈ సినిమా కచ్చితంగా 2024లో విడుదలౌతుంది గుర్తుంచుకోండి అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా తర్వాత, మహేష్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.