Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ లో చిరు రూలింగ్ మళ్లీ మొదలు: నాగ్‌

By:  Tupaki Desk   |   21 Dec 2020 10:10 AM GMT
టాలీవుడ్‌ లో చిరు రూలింగ్ మళ్లీ మొదలు: నాగ్‌
X
తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 ఫినాలే ఎపిసోడ్‌ కు చిరంజీవిని గెస్ట్‌ గా నాగార్జున తీసుకు వచ్చాడు. షో నిర్వాహకులు మరియు నాగార్జున పెట్టుకున్న నమ్మకంను వమ్ము చేయకుండా చిరంజీవి తనదైన శైలిలో కంటెస్టెంట్స్ తో మాట్లాడటంతో పాటు వారి యొక్క మ్యానరిజాలను కూడా అనుకరించి అందరిని అబ్బుర పర్చాడు. సోహెల్‌.. మోనాల్‌.. మెహబూబ్.. అరియానా.. హారిక.. గంగవ్వ ఇలా అందరితో కూడా చాలా సరదాగా సందర్బానుసారం పంచ్‌ లు వేస్తూ అందరివాడిలా మాట్లాడిన చిరంజీవి ఆకట్టుకున్నాడు. అంతకు ముందు చిరంజీవికి నాగార్జున గ్రాండ్‌ వెల్‌ కం ఇచ్చాడు.

చిరంజీవి బాగా సన్నగా అవ్వడంతో పాటు చూడ్డానికి మరింత యంగ్‌ గా కనిపించడంపై నాగార్జున కామెంట్‌ చేశాడు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. మళ్లీ టాలీవుడ్‌ లో రూలింగ్ మొదలు అయ్యింది అంటూ చిరంజీవిని ఉద్దేశించి నాగార్జున అన్నాడు. ఆ మాటలు ప్రస్తుతం మారు మ్రోగిపోతున్నాయి.

టాలీవుడ్ లో రెండు దశాబ్దాలకు పైగా నెం.1 హీరోగా కొనసాగిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లారు. పదేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. రీ ఎంట్రీలో మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. అది వచ్చే ఏడాదిలో జరుగకుండా చూసుకుంటానంటూ చిరు ఇప్పటికే హామీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

మళ్లీ రూలింగ్ మొదలైంది అంటూ చిరంజీవిని ఉద్దేశించి నాగ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఒక స్టార్‌ హీరో మరో స్టార్‌ హీరో గురించి అలాంటి వ్యాఖ్య చేయడం అంటే మామూలు విషయం కాదు. నాగ్‌ అన్నట్లుగానే చిరు రూలింగ్‌ మళ్లీ మొదలైంది.. మరో పదేళ్ల వరకు టాలీవుడ్‌ లో ఆయన్ను కొట్టే వారే ఉండరు అంటూ మెగా ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.