Begin typing your search above and press return to search.

బ్యాచిలర్ విషయంలో కింగ్ జోక్యం చేసుకుంటున్నాడా..?

By:  Tupaki Desk   |   3 Jun 2020 5:33 PM GMT
బ్యాచిలర్ విషయంలో కింగ్ జోక్యం చేసుకుంటున్నాడా..?
X
అక్కినేని అఖిల్ ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కింగ్ నాగార్జున వారసుడిగా 'అఖిల్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కి ఆ సినిమా ఆశించినంత విజయం అందించలేదు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమాగా 'హలో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. మూడో సినిమాగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' కూడా అఖిల్ కి నిరాశే కలిగించింది. ఇప్పుడు నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' ను డైరెక్ట‌ర్‌ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్నాడు అఖిల్. అల్లు అరవింద్ సమర్పకులుగా గీతా ఆర్ట్స్2 బ్యానర్‌ పై బన్నీ వాస్ - వాసు వర్మ నిర్మించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ లిరికల్ 'మనసా మనసా' అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ విశేష ఆదరణ పొందాయి.

కాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా రఫ్ ఎడిటింగ్ అయిన ఔట్ పుట్ ను తెప్పించుకుని నాగార్జున చూశారని.. సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ అసంతృప్తిగా ఫీల్ అయినట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట. ఇవి కేవలం పుకార్లే అట. కాకపోతే నాగార్జున ఒకటి రెండు సీన్స్ మాత్రం రీషూట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడట. కాగా ఈ సినిమాలో లవ్ సీన్స్ లో అఖిల్ - పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ మారింది. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అక్కినేని అభిమానులు ఈ చిత్రంతోనైనా అఖిల్ సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. మరి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా అక్కినేని వారసుడికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో చూడాలి.