Begin typing your search above and press return to search.

దెయ్యం సీక్వెల్ లో నాగ్!?

By:  Tupaki Desk   |   11 Oct 2016 7:30 AM GMT
దెయ్యం సీక్వెల్ లో నాగ్!?
X
అక్కినేని నాగార్జున ప్రస్తుతం భక్తిరస చిత్రమైన 'ఓం నమో వేంకటేశాయ'మూవీలో నటిస్తున్నారు. తిరుమల వెంకన్నకు పరమ భక్తుడైన హథీరాం జీ బాబా పాత్రలో నాగ్ మెప్పించబోతున్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తర్వాత.. నాగ్ చేయనున్న సినిమా ఏంటనే విషయంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు.

తన కొడుకులు ఇద్దరి కెరీర్ లను గాడిలో పెట్టడమే తన తక్షణ కర్తవ్యం అని నాగ్ ఓపెన్ గానే చెప్పేశారు. పైగా ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఎంగేజ్మెంట్.. పెళ్లిళ్లు కూడా దగ్గరపడిపోతుండడంతో.. ఆ పనులు కూడా మోయక తప్పదు. అందుకే కొన్ని నెలలు మూవీస్ కి దూరంగా ఉండాలని భావించారట కానీ.. ఓ దెయ్యం సీక్వెల్ కారణంగా ఆయన పట్టు విడవాల్సి వచ్చిందట. రాజు గారి గది అంటూ సెన్సేషనల్ హిట్ సాధించిన దర్శకుడు ఓంకార్.. ఈ మూవీకి సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ చేసుకుని.. నాగార్జునను కలిశాడట.

ఇప్పటికే పీవీపీ నిర్మాణ సంస్థకూడా రాజుగారిగది సీక్వెల్ ను ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు రాగా.. ఇప్పుడు నాగార్జున కూడా సై అనేశారని తెలుస్తోంది. నిజానికి ఇప్పటివరకూ చిరు-నాగ్-బాలయ్య-వెంకీ లాంటి పెద్ద తెలుగు స్టార్ హీరోలెవరూ హారర్ జోనర్ లో సినిమా తీసేందుకు ట్రై చేయలేదు. కానీ నాగ్ మాత్రం ఈ ట్రెండ్ కి బ్రేక్ వేసి.. హారర్ సినిమా మొదలుపెట్టేస్తారని తెలుస్తోంది. దేవుడి సినిమా 'ఓం నమో వెంకటేశాయ' తర్వాత నాగ్ చేయనున్న మూవీ ఇదేనట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/