Begin typing your search above and press return to search.

ముక్కుమోహం తెలియని వాళ్ల వల్లే అలా చేశా: కింగ్ నాగార్జున

By:  Tupaki Desk   |   6 April 2021 2:30 AM GMT
ముక్కుమోహం తెలియని వాళ్ల వల్లే అలా చేశా: కింగ్ నాగార్జున
X
కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించడంతో ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. అందుకే టీవీ షోలలో, యూట్యూబ్ ఇంటర్వ్యూలలో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. తాజాగా నాగ్.. హీరో రానా నిర్వహిస్తున్న టాక్ షో 'నెంబర్ 1 యారీ'లో పాల్గొన్నాడు. ఆ షోలో తన వైల్డ్ డాగ్ సినిమాతో పాటు చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. అందులో భాగంగానే తన పర్సనల్ విషయాలు కూడా కొన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం యారీలో నాగ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రానా సోషల్ మీడియా గురించి చెప్పండని అడిగిన ప్రశ్నకు నాగ్ వెంటనే సమాధానం చెప్పేసాడు.

నాగ్ సమాధానం చెప్పడం కూల్ గానే చెప్పాడు కానీ అందులో పరమార్థం మాత్రం సోషల్ మీడియా వారికీ స్ట్రాంగ్ గానే తగిలాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. 'నేను సోషల్ మీడియాలో యాక్టీవ్ కాదు. ఆరేడేళ్ల క్రితం ట్విట్టర్ కొత్తగా వచ్చిందని అకౌంట్ ఓపెన్ చేశాను. కానీ కొన్నాళ్లు గడిచాక ట్విట్టర్ అనేది పూర్తిగా ఒపీనియేటెడ్.. నెగిటివ్‌గా మారిపోయింది. ఆ నోటిఫికేషన్స్ యాక్సెప్ట్ చేస్తే మన లైఫ్ మనం మార్చేసుకోవాలి. తెల్లారితే నేను ఏం బట్టలు వేసుకోవాలి.. ఏం తినాలి.. ఏం చేయాలి.. అన్నీ వాళ్లే చెప్తారు. అప్పుడే అనిపించింది ఎవరో అనామకులు ముఖ్యంగా నాకు తెలియని వాళ్లు.. అసలు వాళ్లు ముఖం కూడా నేను చూసి ఉండను. అలాంటి వారు నా లైఫ్‌ డిసైడ్ చేస్తుంటారు. ఇక ఎవరో నా లైఫ్‌ గురించి మాట్లాడుతుంటే నావల్ల కాలేదు. అప్పటినుండి ట్విట్టర్ నోటిఫికేషన్స్ ఆఫ్" అని నాగ్ చెప్పాడు. ప్రస్తుతం నాగ్ మాటలు నెట్టింట చర్చలకు దారితీస్తున్నాయి.