Begin typing your search above and press return to search.
వేల కోట్ల స్కామ్ స్టర్ గా నాగార్జున?
By: Tupaki Desk | 26 March 2021 12:30 PM GMTకింగ్ నాగార్జున ప్రస్తుతం `వైల్డ్ డాగ్` రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తదుపరి ఆయన అతిథి పాత్ర పోషించిన పాన్ ఇండియా మూవీ `బ్రహ్మాస్త్ర` కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరోవైపు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రాన్ని ప్రారంభించేందుకు నాగ్ సిద్ధమవుతున్నారు.ఇంత బిజీ షెడ్యూల్ నడుమ కింగ్ నాగార్జున ఓ పాపులర్ వెబ్ సిరీస్ సీక్వెల్లో నటించే ఆలోచన చేస్తున్నారని కథనాలొస్తున్నాయి. తనకు ఓ వెబ్ సిరీస్ లో నటించాలనుందని నాగార్జున ప్రకటించగానే రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. స్కామ్ 1992 వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించారు. భారతీయ OTT ల్లో బెస్ట్ సిరీస్ ఇది. బాగా లైక్ చేశాను. 1990 లలో హర్షద్ మెహతా కథను తెరపై చిత్రీకరించిన విధానం నచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుపుతున్నాను`` అని నాగ్ అన్నారు. స్కామ్ 1992 దర్శకుడు హన్సాల్ మెహతా నాగ్ ప్రశంసలకు సంతోషించారు. నాగ్ వీడియోను ఉటంకిస్తూ.. హన్సాల్ ట్వీట్ చేశారు.``ఇది నాకు గొప్ప ప్రశంస. నాగ్ సర్ # స్కామ్ 1992 పై మాట్లాడారు.. డ్యూడ్!`` అంటూ ట్వీట్ చేశారు.
హన్సాల్ ప్రస్తుతం స్కామ్ 1992 సీక్వెల్ కథాంశాన్ని రెడీ చేస్తున్నారు. ఈ సీక్వెల్ కి `స్కామ్ స్కామ్ 2002: ది క్యూరియస్ కేస్ ఆఫ్ అబ్దుల్ కరీం తెల్గి` అనే టైటిల్ నిర్ణయించారు. వేల కోట్ల పోస్టల్ స్టాంప్స్ కుంభకోణానికి పాల్పడి అరెస్టయిన తెల్గి జీవితంపై సిరీస్ ఇది. రూ.9000 జీతానికి పని చేసిన ఓ యువకుడు 1.4 బిలియన్ డాలర్ల (100 బిలియన్లు) స్కామ్ ఎలా చేశాడన్నదే ఈ సినిమా కథాంశం. ఈ సిరీస్ లో ప్రధాన పాత్రధారిగా నాగార్జున నటిస్తారా? అన్నది వేచి చూడాలి.
వెబ్ సిరీస్ లో నటించేందుకు చర్చలు జరుపుతున్నానని నాగ్ ప్రకటించారు కాబట్టి ఆయన స్కామ్ 1992 సీక్వెల్లో నటిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.. అయితే దీనిని ఆయన స్వయంగా ధృవీకరించాల్సి ఉంటుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. స్కామ్ 1992 వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించారు. భారతీయ OTT ల్లో బెస్ట్ సిరీస్ ఇది. బాగా లైక్ చేశాను. 1990 లలో హర్షద్ మెహతా కథను తెరపై చిత్రీకరించిన విధానం నచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుపుతున్నాను`` అని నాగ్ అన్నారు. స్కామ్ 1992 దర్శకుడు హన్సాల్ మెహతా నాగ్ ప్రశంసలకు సంతోషించారు. నాగ్ వీడియోను ఉటంకిస్తూ.. హన్సాల్ ట్వీట్ చేశారు.``ఇది నాకు గొప్ప ప్రశంస. నాగ్ సర్ # స్కామ్ 1992 పై మాట్లాడారు.. డ్యూడ్!`` అంటూ ట్వీట్ చేశారు.
హన్సాల్ ప్రస్తుతం స్కామ్ 1992 సీక్వెల్ కథాంశాన్ని రెడీ చేస్తున్నారు. ఈ సీక్వెల్ కి `స్కామ్ స్కామ్ 2002: ది క్యూరియస్ కేస్ ఆఫ్ అబ్దుల్ కరీం తెల్గి` అనే టైటిల్ నిర్ణయించారు. వేల కోట్ల పోస్టల్ స్టాంప్స్ కుంభకోణానికి పాల్పడి అరెస్టయిన తెల్గి జీవితంపై సిరీస్ ఇది. రూ.9000 జీతానికి పని చేసిన ఓ యువకుడు 1.4 బిలియన్ డాలర్ల (100 బిలియన్లు) స్కామ్ ఎలా చేశాడన్నదే ఈ సినిమా కథాంశం. ఈ సిరీస్ లో ప్రధాన పాత్రధారిగా నాగార్జున నటిస్తారా? అన్నది వేచి చూడాలి.
వెబ్ సిరీస్ లో నటించేందుకు చర్చలు జరుపుతున్నానని నాగ్ ప్రకటించారు కాబట్టి ఆయన స్కామ్ 1992 సీక్వెల్లో నటిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.. అయితే దీనిని ఆయన స్వయంగా ధృవీకరించాల్సి ఉంటుంది.