Begin typing your search above and press return to search.

చైతన్య.. అఖిల్.. ఇద్దరూ వద్దన్నారు

By:  Tupaki Desk   |   14 Oct 2017 11:03 AM IST
చైతన్య.. అఖిల్.. ఇద్దరూ వద్దన్నారు
X
టాలీవుడ్ కొత్త పెళ్లికూతురు సమంత నటించిన రాజుగారి గది-2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓంకార్ దర్శకత్వంలో హర్రర్ కథాంశంతో వచ్చిన ఈ మూవీలో సమంత తొలిసారి ఆత్మ పాత్ర పోషించింది. ఇందులో ఆమె మామ నాగార్జున హీరోగా నటించాడు. ఈ సినిమాను చూడనుగాక చూడమని తన ఇద్దరు కొడుకులు తెగేసి చెప్పేశారని నాగార్జున ఓపెన్ గా చెప్పారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మామాకోడళ్లిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాగచైతన్య టాపిక్ రావడంతో అతడు ఎంత భయస్తుడో ఇద్దరూ చెప్పుకొచ్చారు. కనీసం రాజుగారి గది-2 ట్రయిలర్ కూడా చూడలేదన్నాడు. చివరకు పెళ్లి టైంలో ఫ్రెండ్సంతా కలిసికట్టుగా కూర్చుని బలవంతంగా చూపించారని నాగార్జున చెప్పాడు. అఖిల్ ను సినిమా చూడమని అడిగితే మూవీ చూస్తే రెండు రోజులు నిద్ర పట్టదని చెప్పి తన వల్ల కాదని చెప్పేశాడన్నాడు. హర్రర్ సినిమాలంటే తనకు కానీ.. అమలకు కానీ భయం లేదని.. కానీ తన ఇద్దరు కొడుకులకు ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదని నాగ్ అన్నాడు.

ఈమధ్య వచ్చిన జంగిల్ బుక్ పిల్లలంతా తెగచూశారు. అందులో వచ్చిన పామును చూసి చైతన్య తెగ భయపడిపోయాడని సమంత గుర్తు చేసుకుంది. ఒక్క కండిషన్ మీద కొడుకులిద్దరూ సినిమా చూడటానికి ఒప్పుకున్నారని నాగ్ చెప్పాడు. థియేటర్ల తలుపులన్నీ తీసి.. అన్ని లైట్లు వేసి ఉంటే చూస్తామని చెప్పారని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.