Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ 21 అప్‌డేట్‌ : రహ్మాన్‌ కంటే కీరవాణిపైనే నమ్మకం

By:  Tupaki Desk   |   18 July 2020 8:50 AM GMT
ప్రభాస్‌ 21 అప్‌డేట్‌ : రహ్మాన్‌ కంటే కీరవాణిపైనే నమ్మకం
X
ప్రభాస్‌ 21వ చిత్రం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందబోతుంది. ప్రస్తుతం రాధే శ్యామ్‌ ను చేస్తున్న ప్రభాస్‌ ఆ తర్వాత ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. మహానటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు జాతీయ స్థాయి అవార్డును మహానటికి తెచ్చి పెట్టిన ఘనత దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కు దక్కింది. ఇప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ కథతో ప్రభాస్‌ తో మూవీకి నాగ్‌ అశ్విన్‌ రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి హీరోయిన్‌ ఎవరు సంగీత దర్శకుడు ఎవరు అనే విషయాలు ప్రస్తుతం అందరికి ఆసక్తిని కలిగిస్తున్నాయి.

హీరోయిన్‌ గా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రహ్మాన్‌ తో సంప్రదింపులు జరుగుతున్నానే వార్తలు వచ్చాయి. ఆస్కార్‌ అవార్డు గ్రహీత అయిన రహ్మాన్‌ అయితే సినిమాకు భారీతనం కలిసి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు అంటూ ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంకు సంగీతాన్ని సమకూర్చే బాధ్యతను కీరవాణికి అప్పగించే అవకాశం ఉందట.

బాహుబలి రెండు పార్ట్‌ లకు కీరవాణి సంగీతం సమకూర్చారు. బాలీవుడ్‌ స్థాయిలో ఆ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. హిందీ ఆడియన్స్‌ ను కూడా మెప్పించేలా కీరవాణి సంగీతాన్ని ఇస్తారనే నమ్మకంను రాజమౌళి బలంగా నమ్ముతున్నాడు. అందుకే ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి కూడా పెద్దన్న కీరవాణితోనే ట్యూన్స్‌ చేయిస్తున్నాడు. జక్కన్న మాదిరిగానే కీరవాణిపై నాగ్‌ అశ్విన్‌ కూడా చాలా నమ్మకంను ఉంచబోతున్నాడట. తన భారీ చిత్రానికి కీరవాణితో సంగీతాన్ని చేయించబోతున్నాడట. ఈ విషయమై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.