Begin typing your search above and press return to search.

సావిత్రి సినిమాలో ఆమెకు చోటు లేదు

By:  Tupaki Desk   |   7 May 2018 7:11 AM GMT
సావిత్రి సినిమాలో ఆమెకు చోటు లేదు
X
మహానటి సావిత్రిని జెమిని గణేశన్ పెళ్లి చేసుకోవడాని కంటే ముందే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. అందులో ఒకరు పుష్పవల్లి. ఆమెకు పుట్టిన సంతానమే బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ. ఆమెకున్న ప్రాధన్యం దృష్ట్యా సావిత్రి జీవిత కథతో తెరకెక్కికన ‘మహానటి’లో తన పాత్రను చూపిస్తారనే భావిస్తున్నారు చాలామంది. ఆ పాత్ర ఎవరు చేశారనే ఆసక్తి కూడా జనాల్లో ఉంది. కానీ ఈ చిత్రంలో రేఖ పాత్రకు చోటు లేదని తేల్చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

జెమిని గణేశన్ కు మొత్తంగా నలుగురు భార్యలు. ఏడుగురు పిల్లలు. వాళ్లందరినీ చూపిస్తే సావిత్రి కథ డైల్యూట్ అయిపోతుందని భావించిన నాగ్ అశ్విన్.. అందరి జోలికి వెళ్లట్లేదట. నిజానికి కథ రాసుకునేటపుడు సావిత్రి జీవితంలో ప్రతి అంశం చూపించాలనే తాపత్రయం ఉండిందని.. దీంతో చాలా అంశాలు స్క్రిప్టులో చేర్చానని.. ఐతే అది మొత్తం చిత్రీకరిస్తే సినిమా నిడివి ఎక్కడికో వెళ్లిపోతుందని.. ఇబ్బంది తప్పదని భావించి స్క్రిప్టు దశలోనే ఎడిటింగ్ చేయాల్సి వచ్చిందని నాగ్ అశ్విన్ తెలిపాడు.

సావిత్రి అంటే చిన్నప్పట్నుంచి ఉన్న అభిమానంతోనే ఆమె మీద సినిమా తీయాలనుకున్నానని.. కెరీర్ ఆరంభ దశలోనే ఈ సినిమా చేయడం పట్ల తనకేమీ అభ్యంతరాలు లేవని అశ్విన్ చెప్పాడు. నిజానికి ‘ఎవడే సుబ్రమణ్యం’ లాంటి సినిమాను కొంచెం వయసు అయ్యాకే చేస్తారని.. తన తొలి సినిమాగా అలాంటిది చేయడంతో రెండో సినిమాగా ‘మహానటి’ చేయడానికి తనకేమీ ఇబ్బందిగా అనిపించలేదని అశ్విన్ తెలిపాడు.