Begin typing your search above and press return to search.

మెగా, నందమూరి, ఘట్టమనేనిలతో మైత్రి

By:  Tupaki Desk   |   23 Feb 2016 5:24 AM GMT
మెగా, నందమూరి, ఘట్టమనేనిలతో మైత్రి
X
ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఓ లవ్ స్టోరీ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తని ఒరువన్ రీమేక్ 'ధృవ'ను కంప్లీట్ చేయగానే.. సుక్కు సినిమాని స్టార్ట్ చేయనున్నాడు చెర్రీ. ఈ మూవీని ఎవరు నిర్మించనున్నారనే విషయం ఇప్పుడు ఫైనల్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుక్కు-చరణ్ ల సినిమాని తెరకెక్కించనున్నారు.

గతంలో కొన్ని బ్యానర్లు.. పర్టిక్యులర్ గ్రూపులతో, ఫ్యామిలీలతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. ఓ కంఫర్ట్ జోన్ సెట్ చేసుకుని వాళ్లతోనే మూవీస్ నిర్మించేవారు. కానీ కాలంతో పాటు ప్రొడక్షన్ ట్రెండ్ కూడా మారిపోతోంది. ఇపుడు చెర్రీ-సుకుమార్ లతో సినిమా తీయనున్న మైత్రీ మూవీస్.. తమ మొదటి మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసింది. శ్రీమంతుడు చిత్రానికి సహ నిర్మాతలుగా ఘట్టమనేని ఫ్యామిలీతో నిర్మాణం మొదలుపెట్టిందీ సంస్థ.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ ను పూర్తిగా తామే తీస్తున్నారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. అలా నందమూరి కాంపౌండ్ లో కూడా అడుగు పెట్టేసిన వీళ్లు.. ఇప్పుడు మెగా టీంలో రామ్ చరణ్ తో సినిమాకి కూడా సిద్ధమైపోయారు. ఏడాది టైంలో ఘట్టమనేని, నందమూరి, మెగా ఫ్యామిలీలతో సినిమాలు తీయడం అంటే.. మైత్రి మూవీస్ ది పెద్ద రికార్డ్ అనే చెప్పాలి.