Begin typing your search above and press return to search.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సెన్సార్ పూర్తి..!

By:  Tupaki Desk   |   29 Sep 2021 9:30 AM GMT
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సెన్సార్ పూర్తి..!
X
'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్''. 'బొమ్మరిల్లు' 'పరుగు' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు భాస్కర్.. చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన తెలుగు సినిమా ఇది. సినీ అభిమానులను ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. వరుస అప్డేట్స్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ వారు 'U/A' (యూ/ఏ) సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో ఈ సినిమాలో క్లాస్ తో పాటుగా మాస్ ఆడియన్స్ ని అలరించే అంశాలు కూడా ఉండబోతున్నాయని అర్థం అవుతోంది. ఈ సందర్భంగా వదిలిన బ్యూటిఫుల్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ - టీజర్ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకొని.. అఖిల్ కు సూపర్ హిట్ ఇస్తాయనే నమ్మకం కలిగించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' థియేట్రికల్ ట్రైలర్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 30న సాయంత్రం గం. 6.10 నిమిషాలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు.