Begin typing your search above and press return to search.

విడుదలైన రెండేళ్లకు 100 కోట్లు

By:  Tupaki Desk   |   26 May 2019 7:15 AM GMT
విడుదలైన రెండేళ్లకు 100 కోట్లు
X
కొన్ని సినిమాలు అంతే. కాలంతో సంబంధం లేకుండా బంగారు బాతులాగా గుడ్లు పెడుతూనే ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది శ్రీదేవి మామ్. 2017 జులైలో విడుదలైన ఈ మూవీని ఇటీవలే నిర్మాత బోనీ కపూర్ చైనాలో రిలీజ్ చేశారు. అనూహ్యంగా అతి తక్కువ టైంలోనే మామ్ వంద కోట్ల వసూళ్లను దాటేసి ఔరా అనిపించింది. ఎమోషనల్ హిందీ సినిమాలకు ఈ మధ్య చైనా ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. దంగల్-సీక్రెట్ సూపర్ స్టార్-హిందీ మీడియం లాంటివన్నీ అక్కడ రికార్డులు బద్దలు కొట్టాయి.

తాజాగా మామ్ కూడా వీటి సరసన చేరడంతో బోనీ కపూర్ ఆనందం మాములుగా లేదు. కూతురిని హత్య చేసిన వారిని వెతికి పట్టుకుని ప్రతీకారం తీర్చుకునే పాత్రలో శ్రీదేవి నటనకు ప్రేక్షకులు ఇక్కడ సైతం ఘన విజయం అందించారు
ఇప్పుడు చైనాలో సైతం అంతకు మించిన స్పందన రావడం చూసి బోనీ కపూర్ కు మాటలు రావడం లేదు. ప్రత్యేకంగా థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశాడు.

ప్రస్తుతం పింక్ రీమేక్ ని తమిళ్ లో అజిత్ తో నీర్ కొండ పార్వై పేరుతో తీస్తున్న బోనీ దాన్ని ఆగస్ట్ 10న విడుదల చేయబోతున్నారు. ప్రీ రిలీజ్ పరంగా ఇప్పటికే క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న ఆ మూవీ ద్వారా మరో వంద కోట్లకు పైగా ఈజీగా బోనీ కపూర్ పాకెట్ లో చేరుతుందని ట్రేడ్ అంచనా. మొత్తానికి అతిలోకసుందరి స్వర్గానికి ఏగినా ఇంకా తన సినిమాకు వసూళ్లు రాబడుతూ ఉండటం చూస్తే అందుకేకదా లేడీ సూపర్ స్టార్ అనేది.