Begin typing your search above and press return to search.

సీక్వెల్ కోసం 'రామ్'ని పక్కన పెట్టేసిన సూపర్ స్టార్!

By:  Tupaki Desk   |   21 May 2020 11:30 AM GMT
సీక్వెల్ కోసం రామ్ని పక్కన పెట్టేసిన సూపర్ స్టార్!
X
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, హీరోయిన్ మీనా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా దృశ్యం. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అంతేగాక తెలుగు తమిళ హిందీ సింహళీ చైనీస్ భాషలలో రీమేక్ అయి మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఒక సామాన్యుడి జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి.. అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడనేది ఇందులో ముఖ్య కథాంశం. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ మలయాళీ దృశ్యం సినిమాకు సీక్వెల్ రూపొందించడానికి ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ ప్లాన్ లో ఉన్నాడట. అయితే తాజా విషయం ఏమిటంటే..

దర్శకుడు జీతు జోసెఫ్ మోహన్ లాల్ తో దృశ్యం సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించాడు. దీనికంటే ముందు జీతూ.. మోహన్ లాల్, త్రిషలతో 'రామ్' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోయాడు. ఈ మూవీ గత డిసెంబర్‌లో అధికారికంగా ప్రారంభించబడింది. మేకర్స్ ఈ సినిమా షూట్ ప్రారంభించి.. సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, తెలియని కారణాల వల్ల జీతు జోసెఫ్, మోహన్ లాల్ రామ్ సినిమాను ప్రస్తుతానికి నిలిపేయాలని నిర్ణయించుకున్నారట. ఇదిలా ఉండగా.. ఇక ఈ సీక్వెల్ సినిమాలో మొదటి భాగంలో నటించిన మోహన్ లాల్, మీనాలే ప్రధాన పాత్రలలో నటించనున్నారు. మిగిలిన పాత్రలతో పాటు కథ కూడా మారిపోతుందని తెలుస్తుంది. మొదటి సినిమా తరహాలో ఇది కూడా ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలతో తెరకెక్కే థ్రిల్లర్ కథగానే ఉండబోతుందని సమాచారం. మరి దృశ్యం లాగే ఈ సీక్వెల్ విజయం అందుకుంటుందో లేదో చూడాలి.