Begin typing your search above and press return to search.

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు..!

By:  Tupaki Desk   |   10 July 2021 4:00 PM IST
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు..!
X
సోషల్‌ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారం సెలబ్రిటీలను మరియు ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ అభ్యంతరకరమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలో నకిలీ అకౌంట్లను సృష్టించి వివాదస్పద పోస్టులు చేయడం.. సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ మీమ్స్ చేయడం మనం రోజూ చూస్తూనే ఉన్నాం. దీనిని సెలబ్రిటీలు పెద్దగా సీరియస్ గా తీసుకోనప్పటికీ.. ఒక్కోసారి ట్రోలింగ్ అనేది మితిమీరితే మాత్రం దానిపై వారు రియాక్ట్ అవుతుంటారు. తాజాగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

యూట్యూబ్‌ లో కొందరు టార్గెట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారని.. అసభ్యకరమైన కామెంట్స్ - వీడియోలు పోస్ట్ చేస్తున్నారని మోహన్‌ బాబు‌ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పొలిటికల్ మోజో అనే యూట్యూబ్ ఛానెల్ వారు మోహన్ బాబును వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా.. అసభ్యకరమైన కామెంట్స్ తో వీడియోలు పోస్ట్ చేస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన లీగల్ అడ్వైజర్ సంజయ్ ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.