Begin typing your search above and press return to search.
నాన్న.. నేను.. ఓ సాయంత్రం - లక్ష్మీప్రసన్న
By: Tupaki Desk | 25 Jan 2021 5:50 AM GMTటాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ ప్రత్యేకంగా ఉంటుంది. ముక్కుసూటిగా వ్యవహరించే మోహన్ బాబు.. ఆయన్ని ఫాలో అయ్యే ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికప్పుడు తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వీరు ఫ్యామిలీ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల్లో నటించడంతోపాటు నిర్మాణం, ఇతర బిజినెస్ పనుల్లో తీరికలేకుండా గడిపే మంచు ఫ్యామిలీ.. చాలా కాలం తర్వాత రిలాక్స్ మూడ్ లోకి వెళ్లారు. ప్రస్తుతం వారు మాల్దీవుల్లో సేద తీరుతున్నారు.
తమ ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే మంచు లక్ష్మి.. లేటెస్ట్ వెకేషన్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తండ్రి మోహన్ బాబుకు ఓ సర్ప్రైజ్ ఇచ్చినట్లు చెప్పిన లక్ష్మీప్రసన్న.. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ‘గత రాత్రి బీచ్ ఒడ్డున కుటుంబమంతా కలిసి విందు చేసుకున్నాం. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ.. నాన్న నటించిన సినిమాల్లోని పాటలు వింటూ మాకు ఇష్టమైన భోజనం ఆరగించాం’ అని రాసుకొచ్చారు. అంతేకాాకుండా.. ‘చాలా రోజుల తర్వాత ఇలా మాకోసం మేము ఇలా కొంత సమయాన్ని కేటాయించుకోవడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు మంచు లక్ష్మి.
లక్ష్మి షేర్ చేసిన ఫొటోల్లో.. ఒక ఫొటో తెగ ఆకట్టుకుంటోంది. బీచ్ లో కలిసి నడుస్తున్న మోహన్ బాబు, లక్ష్మి కబుర్లు చెప్పుకుంటూ రిలాక్స్ మోడ్ లో వెళ్తున్నారు. ఈ పిక్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఫ్యాన్స్ ఈ ఫొటోలను షేర్ చేస్తుండడంతో.. మంచు ఫ్యామిలీ మాల్దీవుల వెకేషన్ ట్రిప్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక, మోహన్ బాబు కెరీర్ విషయానికొస్తే.. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే ఆయన ప్రధాన పాత్రలో 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమా మొదలైంది. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మోహన్ బాబు క్యారెక్టర్.. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
తమ ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే మంచు లక్ష్మి.. లేటెస్ట్ వెకేషన్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తండ్రి మోహన్ బాబుకు ఓ సర్ప్రైజ్ ఇచ్చినట్లు చెప్పిన లక్ష్మీప్రసన్న.. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ‘గత రాత్రి బీచ్ ఒడ్డున కుటుంబమంతా కలిసి విందు చేసుకున్నాం. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ.. నాన్న నటించిన సినిమాల్లోని పాటలు వింటూ మాకు ఇష్టమైన భోజనం ఆరగించాం’ అని రాసుకొచ్చారు. అంతేకాాకుండా.. ‘చాలా రోజుల తర్వాత ఇలా మాకోసం మేము ఇలా కొంత సమయాన్ని కేటాయించుకోవడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు మంచు లక్ష్మి.
లక్ష్మి షేర్ చేసిన ఫొటోల్లో.. ఒక ఫొటో తెగ ఆకట్టుకుంటోంది. బీచ్ లో కలిసి నడుస్తున్న మోహన్ బాబు, లక్ష్మి కబుర్లు చెప్పుకుంటూ రిలాక్స్ మోడ్ లో వెళ్తున్నారు. ఈ పిక్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఫ్యాన్స్ ఈ ఫొటోలను షేర్ చేస్తుండడంతో.. మంచు ఫ్యామిలీ మాల్దీవుల వెకేషన్ ట్రిప్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక, మోహన్ బాబు కెరీర్ విషయానికొస్తే.. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే ఆయన ప్రధాన పాత్రలో 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమా మొదలైంది. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మోహన్ బాబు క్యారెక్టర్.. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.