Begin typing your search above and press return to search.

'మైండ్ బ్లాక్' సాంగ్ అరుదైన రికార్డు..!

By:  Tupaki Desk   |   24 April 2021 12:30 PM GMT
మైండ్ బ్లాక్ సాంగ్ అరుదైన రికార్డు..!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'సరిలేరు నీకెవ్వరూ'. 2020 సంక్రాంతి సందర్బంగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ తో అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ ఇది. కానీ ఈ సినిమాలో మహేష్ గతంలో స్పెషల్ గా నిలిచిన అంశాలన్నీ టచ్ చేసాడు డైరెక్టర్. ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ చేసింది. అలాగే ఈ సినిమాలో ఒక్కడు సినిమాలో భాగమైన కర్నూల్ కొండారెడ్డి బురుజును కూడా మరోసారి గుర్తుచేసారు మేకర్స్. ఈ సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్ అందించాడు దేవిశ్రీ ప్రసాద్.

అయితే తాజాగా ఈ సినిమాలోని ఓ మాస్ సాంగ్ అరుదైన రికార్డు నమోదు చేసింది. ఈ సినిమాలోని మాస్ డ్యూయెట్ 'మైండ్ బ్లాక్' సాంగ్ ఇటీవలే యూట్యూబ్ వేదికగా 100మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న సాంగ్స్ క్లబ్బులో చేరింది. ఈ పాటలో మహేష్ అదిరే డాన్సులతో పాటు హీరోయిన్ రష్మిక మందన అందాలు ప్రేక్షకులతో ఈలలు వేయించాయని చెప్పాలి. అంతలా హిట్ అయింది ఈ మైండ్ బ్లాక్ సాంగ్. అలాగే ఈ పాటను ఫేమస్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహేష్ 'సర్కారు వారి పాట'తో బిజీకాగా రష్మిక పుష్పతో బిజీ అయింది.