Begin typing your search above and press return to search.

`ఉప్పెన` నిర్మాత‌లతో మెగా మేన‌ల్లుడు బిగ్ డీల్

By:  Tupaki Desk   |   19 April 2021 6:35 AM GMT
`ఉప్పెన` నిర్మాత‌లతో మెగా మేన‌ల్లుడు బిగ్ డీల్
X
మెగా మేన‌ల్లుడు వైష్ణవ్ తేజ్ `ఉప్పెన`తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద 100కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. డెబ్యూ హీరోల్లో చిన్న బడ్జెట్ చిత్రాలలో ఇటీవలి కాలంలో అతిపెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా రికార్డుల‌కెక్కింది. హృతిక్-క‌హోనా ప్యార్ హై.. చ‌ర‌ణ్ -చిరుత‌.. అఖిల్- అఖిల్ -అఖిల్ చిత్రాల రికార్డుల్ని బ్రేక్ చేసింది.

ఉప్పెన స‌క్సెస్ అనంత‌రం వైష్ణవ్ తేజ్ కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. త్వరలో నటించబోయే రెండు చిత్రాలకు ఈ నటుడు సంతకం చేసినట్లు చెబుతున్నారు. ఉప్పెనను నిర్మించిన టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ వైష్ణవ్ తేజ్ తో రెండు చిత్రాల ఒప్పందం కుదుర్చుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందంపై సంతకం చేసిన వైష్ణవ్ ఫుల్ ఖుషీగా ఉన్నాడ‌ట‌.

ఈ రెండు చిత్రాల‌కు అగ్ర దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ లను ఖరారు చేస్తార‌ని తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుక్కూ ఈ చిత్రాలను నిర్మిస్తాడు. ప్రస్తుతానికి ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. చర్చలు జరుగుతున్నాయి.

వైష్ణవ్ తేజ్ ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోని `కొండపొలం` షూటింగ్ పూర్తి చేసారు. ఈ చిత్రం త్వరలో విడుద‌ల కానుంది. అతను తన మూడవ చిత్రానికి గిరీశ‌య్య దర్శకత్వం వహిస్తాడు. బివిఎస్.ఎన్ నిర్మించే ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది. కేతికా శర్మ ఇందులో క‌థానాయిక‌. వచ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది.