Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి దూరం చేసిన మహమ్మారి..?

By:  Tupaki Desk   |   30 Dec 2020 3:00 PM GMT
మెగా ఫ్యామిలీని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి దూరం చేసిన మహమ్మారి..?
X
మెగా ఫ్యామిలీలో ఇటీవల క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - ఉపాసన దంపతులు హోస్ట్ చేసిన ఈ వేడుక‌ల‌లో మెగా ఫ్యామిలీకి చెందిన కజిన్స్ అందరూ హాజరై సంబరాలు చేసుకున్నారు. అందులో అల్లు అర్జున్‌ - వరుణ్‌ తేజ్‌ - సాయి తేజ్‌ - వైష్ణవ్‌ తేజ్‌ - అల్లు శిరీష్‌ - కల్యాణ్‌ దేవ్ - కొత్త జంట నిహారిక-వెంకట చైతన్య - సుస్మిత-విష్ణుప్రసాద్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ క్రమంలో రాబోయే కొత్త సంవత్సరం వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కరోనా కలకలం రేగడంతో న్యూ ఇయర్ సెలెబ్రేషన్ ప్లాన్స్ స్పాయిల్ అయ్యాయి.

క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగిన మూడు రోజులు రామ్‌ చరణ్‌ - వరుణ్‌ తేజ్‌ ఇద్దరూ కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. దీంతో ఆ పార్టీలోనే ఎవరో ఒకరి నుంచి వాళ్లిద్దరికీ అంటుకుందా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అలానే మిగతావాళ్ల సంగతేంటి అనే చర్చలూ మొదలయ్యాయి. ప్రస్తుతం చరణ్ తో పాటు ఉపాసన కూడా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. వరుణ్ తేజ్ కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. కొత్త జంట నిహారిక - చైతన్య హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. చరణ్ - వరుణ్ లకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో మిగతా వారు కూడా ఇంటికే పరిమితమయ్యారట. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఇప్పుడు సోషల్ గ్యాధరింగ్స్ ని పక్కన పెట్టి కొత్త ఏడాది వేడుకలకు దూరంగా ఉండనున్నారు.