Begin typing your search above and press return to search.

డబ్బింగ్ సినిమాకి డబుల్ డబ్బులు

By:  Tupaki Desk   |   2 July 2017 1:08 PM IST
డబ్బింగ్ సినిమాకి డబుల్ డబ్బులు
X
కోలీవడ్ మూవీ పిచ్చైకారన్ ను బిచ్చగాడు అంటూ డబ్బింగ్ చేసిన నిర్మాతలకు బోలెడన్ని లాభాలు వచ్చి పడ్డాయి. ఆ తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ సాధించిన డబ్బింగ్ మూవీ ఏదీ లేదు. ఇప్పుడు మరీ ఆ రేంజ్ లో కాకపోయినా.. మరో డబ్బింగ్ సినిమాకి మంచి లాభాలు వచ్చింది. పెట్టిన పెట్టుబడి అంతకు అంత లాభాలను సంపాదించి పెట్టింది మరకతమణి.

అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాధం రిలీజ్ కి సరిగ్గా వారం ముందు మరకతమణి అంటూ.. సరైనోడులో విలన్ గా మెప్పించిన ఆది పినిశెట్టి నటించిన డబ్బింగ్ సినిమా విడుదల అయింది. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను నిర్మాతలు కేవలం రూ. 50 లక్షలకే కొనుగోలు చేశారు. మరో రూ. 15 లక్షలను ప్రచారం కోసం వెచ్చించారు. మొత్తం 65 లక్షల రూపాయల ఖర్చుతో వచ్చిన ఈ మూవీకి.. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ. 1.3 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అంటే పెట్టుబడికి రెట్టింపు మొత్తాన్ని వసూలు చేయగలిగింది మరకతమణి.

ఇక తెలుగు శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా మంచి అమౌంట్ నే రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ జనాలు అంటున్నారు. వైశాలి చిత్రంతో తెలుగు జనాలకు బాగా నోటీస్ అయన ఆది పినిశెట్టి.. సరైనోడు చిత్రంలో విలన్ గా నటించిన తర్వాత మరింతగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ శుక్రవారం విడుదల కానున్న నాని మూవీ నిన్ను కోరిలో కూడా ఆది కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/