Begin typing your search above and press return to search.

మంచు వారి 100 కోట్ల సినిమా.. అలా ఉంటుందట

By:  Tupaki Desk   |   3 Jun 2023 8:00 AM GMT
మంచు వారి 100 కోట్ల సినిమా.. అలా ఉంటుందట
X
మంచు మోహన్ బాబు చివరిగా సన్నాఫ్ ఇండియా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. దీని తర్వాత రీసెంట్ గా శాకుంతలం సినిమాలో దూర్వాస మహర్షి పాత్రలో కనిపించి మెప్పించారు.

ఇక మంచు విష్ణు చివరిగా చేసిన మోసగాళ్ళు, జిన్నా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మోసగాళ్ళు సినిమాని పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో చేసిన ఎవరికి కనెక్ట్ కాలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మంచు మోహన్ బాబుతో అతని తనయుడు మంచు విష్ణు ఏకంగా వంద కోట్ల రూపాయిలతో పాన్ ఇండియా మూవీ చేయనున్నారంట. రియల్ లైఫ్ కథతో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారని క్లారిటీ ఇచ్చారు. మంచు మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల నేపథ్యంలో సామాజిక సందేశంతో ఉంటుందంట.

ఇక మోహన్ బాబు విద్యాసంస్థలని ఏర్పాటు చేయాలనే సంకల్పం నుంచి వాటి పునాదులు నుంచి యూనివర్సిటీగా అభివృద్ధి వరకు కథని చెప్పబోతున్నారంట.

ప్రస్తుతం కథపైన వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారంట. మరి వంద కోట్ల బడ్జెట్ అనేది ఎంత వరకు వాస్తవం తెలియాల్సి ఉంది.

అయితే గతంలో మోసగాళ్ళు మూవీని కూడా 50 కోట్ల బడ్జెట్ తో తీసామని చెప్పారు. మూవీ రిలీజ్ తర్వాత అంత బడ్జెట్ అయ్యుండదు అనే టాక్ వచ్చింది. ఇప్పుడు మోహన్ బాబుతో వంద కోట్ల బడ్జెట్ తో సినిమా అంటే అది సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. మంచు విష్ణు జిన్నా తర్వాత ఇప్పటి వరకు తనకి సంబంధించి కొత్త ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేయలేదు.

అయితే మంచు మనోజ్ మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక మూవీ స్టార్ట్ చేసేశాడు. ఈ మూవీ షూటింగ్ కూడా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసి అంచనాలు క్రియేట్ చేశారు. ఇక మంచు లక్ష్మి కూడా కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోనట్లు ఉంది. మరి ఈ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది.