Begin typing your search above and press return to search.

'ఆహా' మంచు ఫ్యామిలీ మొత్తం దిగింది

By:  Tupaki Desk   |   31 Oct 2021 4:56 AM GMT
ఆహా మంచు ఫ్యామిలీ మొత్తం దిగింది
X
నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్‌ గా చేస్తున్న అన్ స్టాపబుల్‌ ఆహా లో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. దీపావళి కానుకగా మొదటి ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మొదటి ఎపిసోడ్‌ లో బాలకృష్ణ గెస్ట్‌ గా మోహన్‌ బాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. అన్‌ స్టాపబుల్‌ మొదటి గెస్ట్ అనే విషయం మోహన్‌ బాబు అనే విషయం ముందుగానే లీక్ అయ్యింది కాని తాజాగా ఆహా వారు రిలీజ్‌ చేసిన ఫొటోలను బట్టి చూస్తుంటే మంచు వారి ఫ్యామిలీ మొత్తం దిగిపోయింది అన్నట్లుగా షో ఉండబోతుంది. మోహన్‌ బాబు మాత్రమే కాకుండా విష్ణు మరియు మంచు లక్ష్మిలు కూడా బాలయ్య షో లో కనిపించబోతున్నారు.

షో ఆరంభం నుండి చివరి వరకు కూడా ముగ్గురు ఉంటారా లేదంటే మోహన్‌ బాబు మెయిన్ గెస్ట్‌ గా ఉండి చివర్లో వారిద్దరు వస్తారా అనేది చూడాలి. బాలకృష్ణ హోస్ట్‌ అంటే ఆయన అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇప్పటి వరకు బాలకృష్ణ సినిమాలు తప్ప మరే వ్యాపకం పెట్టుకోలేదు. నిర్మాతగా అప్పుడప్పుడు ప్రయత్నించినా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మొదటి సారి సినిమాలకు దూరంగా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ రంగంలోనే ఓటీటీ ద్వారా ఒక టాక్ షో ద్వారా రాబోతున్నాడు అంటే ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా మొదటి ఎపిసోడ్‌ నే మోహన్‌ బాబు అండ్‌ ఆయన ఫ్యామిలీతో చేయడం అనేది ఖచ్చితంగా ఒక అరుదైన అద్బుతమైన షో అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సాదారణంగా మోహన్‌ బాబు టాక్ షో ల్లో ఎక్కువగా కనిపించడు. ఆమద్య అలీ టాక్ షో లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్‌ షో లో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ షో ఉంటుందనే నమ్మకంను ఆహా వారు వ్యక్తం చేస్తున్నారు. పైసా వసూళ్‌ షో అంటూ ధీమాగా ఆహా ప్రోమోలు విడుదల చేస్తోంది. మోహన్‌ బాబు నుండి బాలయ్య రాబట్టే ప్రత్యేకమైన విషయాలు ఏంటీ.. ఇద్దరి మద్య టాక్‌ షో ఎలా సాగుతుంది అనేది చూడాలి. మంచు విష్ణు మరియు మంచు లక్ష్మిలు ఎలాంటి ప్రశ్నలను బాలయ్య నుండి ఎదుర్కోబోతున్నారు అనేది కూడా చూడాలి. మొత్తానికి దీపావళి రోజు కోసం నందమూరి బాలయ్య అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.