Begin typing your search above and press return to search.

ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలి: స్టార్ యాక్ట్రెస్

By:  Tupaki Desk   |   2 April 2021 9:13 AM GMT
ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలి: స్టార్ యాక్ట్రెస్
X
ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మరోసారి ప్రజలను అవస్థ పెడుతోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా యాభైవేలకు పైగా సామాన్యులు ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా కరోనా బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మహమ్మారి పరిస్థితి ఇంతకుముందులా లేదు. అందుకనే దేశంలో ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్ తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వం సూచన మేరకు దేశవ్యాప్తంగా అందరూ 45 ఏళ్ళు పైబడినవారు మొదటి మరియు రెండవదశ వాక్సిన్ లను వేసుకుంటున్నారు. ఐతే తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరుగా వాక్సిన్ తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా బాలీవుడ్ సుందరి మలైకా అరోరా.. తొలి డోస్ వాక్సిన్ తీసుకుంది. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాలకంటే కూడా మహారాష్ట్రలోనే కరోనా ఎక్కువగా పంజా విసురుతుంది. ఇప్పటికే కోవిడ్ బాధితుల సంఖ్య లక్షల్లో నమోదు అయింది. ఐతే యాక్ట్రెస్ మలైకా అరోరా వయసు ఐదు పదులకు దగ్గరపడటంతో వేసుకుంది. అలాగే ఆమె వాక్సిన్ వేసుకున్న తర్వాత.. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని సూచించింది. కరోనాకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోరాడాలని.. ఈ మహమ్మారిని తరిమికొట్టాలని మలైకా ఇంస్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మలైకా ఇంటిపట్టునే ఉంటూ తన ఫాలోయర్స్ కు వర్కౌట్ పాఠాలు నేర్పుతోంది. అలాగే మలైకా టీకా వేయించుకున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.