Begin typing your search above and press return to search.

'శాకుంతలం' మేజర్ పార్ట్ అప్పుడే పూర్తయిందా..??

By:  Tupaki Desk   |   2 Jun 2021 1:30 PM GMT
శాకుంతలం మేజర్ పార్ట్ అప్పుడే పూర్తయిందా..??
X
దక్షిణాది స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత.. ప్రస్తుతం 'కాతువకుల రెండు కాదల్' అనే తమిళ సినిమాతో పాటుగా తెలుగులో మరో సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ భారీ సెట్స్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పౌరాణిక చిత్రం చేస్తోంది. ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తుంది. ఈ భామ పదేళ్ల కెరీర్లో మొదటిసారి పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో శాకుంతలం సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం విదితమే. దాదాపు ఐదేళ్ల తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ నుండి కొత్త సినిమా మొదలు పెట్టాడు.

ఇరవై ఏళ్లకు పైగా కెరీర్లో డైరెక్టర్ గుణశేఖర్ ఎన్నో హిట్స్.. అలాగే ప్లాప్స్ కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మహాభారతం ఆదిపర్వంలోని ప్రేమకథ "శాకుంతలం" సబ్జెక్టును సినిమాగా రూపొందిస్తున్నాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా శాకుంతలం మూవీ విషయం ప్రస్తావించి.. 'మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలం ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నాను. దుష్యంత రాజు, శకుంతలదేవిల ప్రేమకథను హిమాలయాల నేపథ్యంలో తెరకెక్కిస్తానని చెప్పాడు. అలాగే శాకుంతలం మూవీ మేజర్ షూటింగ్ పార్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కంప్లీట్ అవుతుంది. స్క్రిప్ట్ రెడీ చేయడానికి చాలా సమయం పట్టింది.

శకుంతల క్యారెక్టర్ కోసం అందంతో పాటు యాక్టింగ్ స్కిల్స్ బాగున్న హీరోయిన్ కావాలని వెయిట్ చేశామని తెలిపాడు. మొత్తానికి టాలెంటెడ్ సమంత ఖరారైంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. శాకుంతలం సినిమా షూటింగ్ 50% పూర్తి అయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడని వార్తలు వస్తున్నాయి. అలా షూట్ ప్రారంభించారో లేదో అప్పుడే 50% షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అయిందని ప్రేక్షకులలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ గుణశేఖర్ మాట్లాడుతూ.. మే నెలలో 10వ తేదీ వరకు షూటింగ్ జరిపాము. ప్రస్తుతం మధ్యాహ్నం 1వరకు వెసులుబాటు లభించడంతో త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలు పెడతామని.. షూటింగ్ ఇంత త్వరగా ఖరారు కావడానికి కారణం సమంత - ప్రొడ్యూసర్ నీలిమ అని తెలిపినట్లు సమాచారం.