Begin typing your search above and press return to search.

ఇద్దరమ్మాయిలతో మహేష్ రొమాన్స్..?

By:  Tupaki Desk   |   18 May 2021 2:30 AM GMT
ఇద్దరమ్మాయిలతో మహేష్ రొమాన్స్..?
X
'అతడు' 'ఖలేజా' సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యాట్రిక్ మూవీకి ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే క్రమంలో '#SSMB28' ప్రాజెక్ట్ గురించి డైలీ ఏదొక వార్తలు వస్తూనే ఉంది. ఇందులో శిల్పాశెట్టి నటించనుందని.. అక్కినేని హీరో సుమంత్ - సునీల్ కీలక పాత్రలు పోషించనున్నారని.. బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారని.. ఇలా చెప్పుకుంటూనే ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం ఇందులో మహేష్ సరసన నటించే హీరోయిన్ ను మేకర్స్ ఇంకా ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. అలానే త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్ లో ఇద్దరు హీరోయిన్లకు చోటు కల్పించారని టాక్ వినిపిస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్స్ ఇద్దరికీ ప్రాధాన్యత ఉంటుందట. త్రివిక్రమ్ గత చిత్రాలతో ఎక్కువ శాతం ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ కు కూడా అదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇంకా హీరోయిన్లను ఫిక్స్ చేయలేదని.. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత హీరోయిన్ల గురించి ఆలోచిస్తారని టాక్.

కాగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కృష్ణ పుట్టిన‌రోజైన మే 31న ఈ సినిమాని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించనున్నారని సమాచారం. 'సర్కారు వారి పాట' టాకీ పార్ట్ పూర్తైన వెంటనే '#SSMB28' సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.