Begin typing your search above and press return to search.

మే 31న ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సూపర్ స్టార్...!

By:  Tupaki Desk   |   6 May 2020 5:45 AM GMT
మే 31న ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సూపర్ స్టార్...!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టి 'బ్లాక్ బస్టర్ కా బాప్' అనిపించుకున్నాడు. ఈ సినిమా వచ్చి ఇప్పటికి నాలుగు నెలలవుతున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మహేష్ ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మహేష్ బాబు అనుకోకుండా వచ్చిన హాలిడేస్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. డైలీ పిల్లలతో ఆడుకుంటూ తనకు దొరికిన సమయాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. మహేష్ తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న నెక్స్ట్ సినిమాకి 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నాడు. మనకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న అఫిసియల్ గా స్టార్ట్ చేయబోతున్నారు. ప్రతి ఏడాది కృష్ణ బర్త్ డేకి తన చిత్రానికి సంబంధించిన ఏదొక అప్డేట్ ఇవ్వడం మహేష్ బాబుకి సెంటిమెంటుగా వస్తోంది. ఈ విధంగా తన కెరీర్లో 27వ చిత్రాన్ని అదే రోజు స్టార్ట్ చేయబోతున్నాడట.

పూజా కార్యక్ర‌మాల‌తో లిమిటెడ్ టీమ్ తో మహేష్ - ప‌రుశ్ రామ్ మూవీ ఓపెనింగ్ గ్రాండుగా జ‌ర‌గ‌నుందని సమాచారం. కాకపోతే ఎప్పటి లాగే మహేష్ బాబు ఓపెనింగ్ రోజు అటెండ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మహేష్ తన సినిమా ఓపెనింగ్ కి రాకపోవడం అనేది సెంటిమెంటుగా భావిస్తాడని అందరికి తెలిసిన విషయమే. అయితే అదే రోజు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చే ఇంకో విషయం కూడా ఉండబోతోందట. అదేంటటే ఈ సినిమాలో మహేష్ న్యూలుక్ ని కూడా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఫ‌స్ట్ లుక్ అని కాకుండా పుష్ప‌లో త‌న స్టైలింగ్ ఎలా ఉంటుందో తెలిపేందుకు ఒక పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఈ విషయంలో బ‌న్నీని మ‌హేశ్ ఫాలో అవుతున్నదనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవ‌లే అల్లు అర్జున్ 'పుష్ప' పోస్టర్ ఇలానే వ‌దిలాడు. ఇప్పుడు అదే టైపులో మ‌హేశ్ కూడా త‌న స్టైల్ లుక్ ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. దీని కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ మే 31వ తేదీ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

కాగా మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ.. బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్, ఎంబీ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉండబోతోందని డైరెక్టర్ ప్రకటించాడు. ఎలివేషన్ సీన్స్ మరియు కమర్షియల్ గూస్ బమ్స్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ గురించి ఫ్యాన్స్ కంగారు పడవలసిన అవసరం లేదని ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చాడు పరశు రామ్. మరి ఈ సినిమాతో మహేష్ తన సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తాడేమో చూడాలి.