Begin typing your search above and press return to search.

విక్రమ్ కి విలన్ గా మహేష్!!

By:  Tupaki Desk   |   15 March 2016 4:22 AM GMT
విక్రమ్ కి విలన్ గా మహేష్!!
X
ప్రస్తుతం ఇరు మగన్ చిత్రాన్ని చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రం. ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానున్న ఇరు మగన్ లో విక్రంకి జంటగా నయనతార - నిత్యామీనన్ లు నటించారు. అయితే, ఇప్పటికే చియాన్ చేయబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోతోంది. తిరు దర్శకత్వంలో 'గరుడ' అనే టైటిల్ పై మూవీ చేస్తున్నాడు విక్రమ్.

గరుడ కోసం విక్రమ్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. దీనిపై ఇప్పటికే పలు రకాల గెటప్స్ ని పరిశీలిస్తున్నామని డైరెక్టర్ తిరు అంటున్నాడు. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ డైరెక్టర్ కం యాక్టర్ మహేష్ మంజ్రేకర్ నటించబోతున్నాడు. గతంలో తమిళ్ లో అజిత్ కు విలన్ గా ఆరంభం చేసిన ఈయన.. ఇప్పుడు మరోసారి కోలీవుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ పాత్రకు ఆయనే సరిగ్గా సరిపోతాడని భావించడంతో.. ఈ రోల్ చేసేందుకు తనే ఒప్పించానని తిరు చెబుతున్నాడు.

ఇప్పటికే చెన్నై శ్రీ పెరంబదూర్ లో గరుడ కోసం 100 ఎకరాల్లో భారీ సెట్ ని నిర్మించారు. తొలి రోజు షూటింగ్ కి యూనిట్ అంతా హాజరవుతారని డైరెక్టర్ తిరు అంటున్నాడు. గరుడలో విక్రంకి జంటగా చందమామ కాజల్ నటించనుండడం విశేషం.