Begin typing your search above and press return to search.

#మహేష్27: కియారానా కొత్త హీరోయినా?

By:  Tupaki Desk   |   21 Jan 2020 5:42 AM GMT
#మహేష్27: కియారానా కొత్త హీరోయినా?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' ఈ సంక్రాంతి కి రిలీజ్ అయింది. సినిమా విడుదలై పదిరోజులు కావడంతో ఇక మహేష్ నెక్స్ట్ సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. మహేష్ తన నెక్స్ట్ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే నుంచి సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్.. ఇతర ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో వంశీ పైడిపల్లి బిజీగా ఉన్నారట. సంగీత దర్శకుడిగా థమన్ ను ఎంచుకున్నారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా హీరోయిన్ విషయంలో కూడా చర్చలు సాగుతున్నయట. వంశీ ఈ సినిమాకు ఒక కొత్త హీరోయిన్ ను తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారట. అయితే నమ్రత టీమ్ మాత్రం ఈ సినిమాకు కియారా అద్వానిని తీసుకునే ప్రయత్నాలలో ఉన్నారట. 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ కు జోడీగా కియారా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ - కియారా జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే కియారా ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. 'కబీర్ సింగ్' ఘన విజయం తర్వాత డిమాండ్ భారీగా పెరిగింది. బిజీగా మారిపోయింది. దీంతో తెలుగు సినిమాలో నటించే ఉద్దేశంలో లేదట. అంతే కాకుండా 'సరిలేరు నీకెవ్వరు' రష్మిక టైప్ లో ఓవరాక్షన్ చేసే పాత్రలు ఆఫర్ చేస్తారేమోననే సందేహాలు కూడా ఉండడంతో ఈ సినిమా ఆఫర్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టాక్ ఉంది.

అయితే ఇంకా #మహేష్27 లాంచ్ కూడా జరగలేదు కాబట్టి హీరోయిన్ ను ఖరారు చేసేందుకు చాలా సమయం ఉంది. వంశీ పైడిపల్లి తన సినిమాలకు ఎప్పుడూ టాప్ హీరోయిన్లనే ఎంచుకుంటారు. మరి మహేష్ కోసం ఏం హీరోయిన్ ను తీసుకొస్తారో వేచి చూడాలి.