Begin typing your search above and press return to search.

ఆ విషయంలో మహేష్ బాబుని బన్నీ అందుకుంటాడా..?

By:  Tupaki Desk   |   3 April 2020 6:30 AM GMT
ఆ విషయంలో మహేష్ బాబుని బన్నీ అందుకుంటాడా..?
X
ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి వార్ లో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ పోటీ పడిన విషయం తెలిసిందే. ఒకరు బాక్సాఫీస్ మొగుడు అంటూ వస్తే, మరొకటి రంకు మొగుడు అంటూ వచ్చాయి. కొన్ని ఏరియాలలో ‘బాహుబలి 2’ రికార్డులను ఈ రెండు సినిమాలు బ్రేక్ చేసాయి కూడా. మాది ఇండస్ట్రీ హిట్ అంటే, కాదు మాది ఇండస్ట్రీ హిట్ అంటూ పోటా పోటీగా చెప్పుకున్నారు. వాస్తవానికి ఈ రెండు సినిమాలు కూడా సంక్రాతి విన్నర్లుగా నిలిచాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి. ఈసారి థియేటర్లలో కాకుండా టీఆర్పీ రేటింగులతో తలపడబోతున్నాయి. మార్చి 25న ఉగాది పండుగ సందర్భంగా జెమిని ఛానల్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ పండుగ రోజు సాయంత్రం ప్రసారం అయింది. ప్రజలు పండుగనాడు కూడా కనీసం బయటకు రాలేని స్థితిలో ఉండటంతో బుల్లితెరపై వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ను విరగబడి చూసారు. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో టెలివిజన్ వ్యూవర్‌ షిప్ రేటింగ్ 23.4 టీఆర్పీని ‘సరిలేరు నీకెవ్వరు’ సొంతం చేసుకుంది.

తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇదే అత్యధిక టీఆర్పీ. గతంలో ‘బాహుబలి 2’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ కు 22.7 టీఆర్పీ రాగా ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ దాన్ని దాటేయడం విశేషం. ‘సాహో’, ‘సైరా’ లాంటి భారీ సినిమాలకు కూడా బుల్లితెర పై చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి. అయితే వీటిని బ్రేక్ చేస్తూ ‘సరిలేరు నీకెవ్వరు’ బుల్లితెర పై ఒక సరికొత్త క్రియేట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో మహేష్ ..అల్లు అర్జున్ కు బుల్లితెరలో సరైన సమాధానమిచ్చి సరిలేరు అనిపించుకున్నాడంటూ మహేష్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు. అయితే సంక్రాతి విన్నర్లలో ఒకటైన సరిలేరు నీకెవ్వరూ రికార్డ్ టీఆర్పీ నమోదు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి 'అల వైకుంఠపురంలో' మూవీపై పడింది. త్వరలో బుల్లితెరపైకి రానున్న ఈ చిత్రం టీఆర్పీ రేటింగులో సరిలేరు ను క్రాస్ చేస్తుందో లేదో అనే చర్చ మొదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం టీవీల్లో ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి.