Begin typing your search above and press return to search.
రాజమౌళితో పాన్ ఇండియా మూవీపై మహేష్ క్లారిటీ
By: Tupaki Desk | 15 Oct 2021 2:30 AM GMTసూపర్స్టార్ మహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట తెరకెక్కుతోంది. ఇది సంక్రాంతి 2022 బరిలో విడుదలవుతుంది. అటుపై త్రివిక్రమ్ తో సినిమా చేస్తారు. ఆ తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళితో పని చేస్తాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అన్నదానిపై ఇన్నాళ్లు సరైన క్లారిటీ రాలేదు.
తాజా సమాచారం మేరకు.. ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రారంభిస్తారు. మహేష్ బాబు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ -``రాజమౌళి తో పాన్-ఇండియా అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నానని.. హిందీలో అరంగేట్రం చేయడానికి ఇదే సరైన సినిమా ``అని తెలిపారు. ఈ చిత్రం బహు భాషల్లో రూపొందుతుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన పాన్ ఇండియన్ చిత్రం RRR విడుదలైన వెంటనే రాజమౌళి మహేష్ బాబు సినిమాపై దృష్టి పెడతారు. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్క్రిప్టుపై పని చేస్తున్నారు.
విజయేంద్రుడు ఎలాంటి కథ రెడీ చేస్తున్నారు?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పటికే అగ్ర కథానాయకులందరితో సినిమాలు చేశారు. ఒక్కరిద్దరు తప్ప. అందులో మహేష్ ఒకరు. రాజమౌళితో ప్రాజెక్ట్ పై మహేష్ లో క్యూరియాసిటీ ఉన్నా ఎందుకనో ఇన్నాళ్ల వరకూ కుదరలేదు. సూపర్ స్టార్ మహేష్ - దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకూ వీలు పడలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి కి విజయేంద్రులకు ఇప్పటికి క్లారిటీ వచ్చిందని అర్థమవుతోంది.
స్క్రిప్టు ఫైనల్ అయ్యాకే మహేష్ కానీ రాజమౌళి కానీ అధికారికంగా సినిమాని ప్రకటిస్తారు. ఇక ఆ టైమ్ వచ్చేసిందని అర్థమవుతోంది. నిజానికి మహేష్ ఆగస్టు 9న తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా రివీల్ చేసారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో చాలా ప్రత్యేకమైన చిత్రం రాబోతుందని వెల్లడించారు. అలాగే ఇది `బాహుబలి` లాంటి భారీ విజువల్ బేస్డ్ సినిమా కాదని కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగని సాధారణ సినిమా కూడా కాదు. అందరి అంచనాలను తలకిందులు చేసే స్థాయిలో జక్కన్న స్క్రిప్ట్ ఉంటుందని ప్రచారమైంది. అడవి నేపథ్యంలో అడ్వంచరస్ థ్రిల్లర్ కథాంశంతో స్క్రిప్టును తీర్చిదిద్దుతున్నారని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత మరో కొత్త జానర్ స్క్రిప్టును కూడా మహేష్ పరిశీలించారని కథనాలొచ్చాయి. అయితే ఏది ఖాయమైంది? ఎలాంటి సినిమా చేస్తారు? అన్నది మహేష్ కానీ జక్కన్న కానీ క్లారిటీ గా చెప్పాల్సి ఉంటుంది.
గరుత్మంతుని కథతో..!
సరిగ్గా బాహుబలి రిలీజ్ అనంతరం జక్కన్న తో మహేష్ సినిమా ఫిక్సయ్యిందని ఇది పురాణేతిహాసాల నేపథ్యంలో కథతో తెరకెక్కుతుందని కూడా ప్రచారమైంది. అప్పట్లోనే మహేష్ ని గరుత్మంతుడిగా రాజమౌళి చూపిస్తారని కూడా టాక్ వినిపించింది. దానికోసం మహేష్ తన రూపం మార్చుకుంటారని గుసగుస వైరల్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఎందుకనో ఆ టాపిక్ తెర మరుగైంది. మరోవైపు అల్లు రామాయణంలో మహేష్ శ్రీరాముడి పాత్రలో నటిస్తారని కూడా ఇటీవల గుసగుస వైరల్ అయింది. కానీ మహేష్ దానిని ధృవీకరించలేదు. అంటే రామాయణంలో నటించేందుకు అవకాశం లేదనే దీనర్థం. ఎట్టకేలకు మహేష్ దృష్టి పూర్తిగా రాజమౌళి తో స్క్రిప్టును ఫైనల్ చేయించుకునే పనిలోనే ఉందని అర్థమవుతోంది.
తాజా సమాచారం మేరకు.. ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రారంభిస్తారు. మహేష్ బాబు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ -``రాజమౌళి తో పాన్-ఇండియా అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నానని.. హిందీలో అరంగేట్రం చేయడానికి ఇదే సరైన సినిమా ``అని తెలిపారు. ఈ చిత్రం బహు భాషల్లో రూపొందుతుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన పాన్ ఇండియన్ చిత్రం RRR విడుదలైన వెంటనే రాజమౌళి మహేష్ బాబు సినిమాపై దృష్టి పెడతారు. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్క్రిప్టుపై పని చేస్తున్నారు.
విజయేంద్రుడు ఎలాంటి కథ రెడీ చేస్తున్నారు?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పటికే అగ్ర కథానాయకులందరితో సినిమాలు చేశారు. ఒక్కరిద్దరు తప్ప. అందులో మహేష్ ఒకరు. రాజమౌళితో ప్రాజెక్ట్ పై మహేష్ లో క్యూరియాసిటీ ఉన్నా ఎందుకనో ఇన్నాళ్ల వరకూ కుదరలేదు. సూపర్ స్టార్ మహేష్ - దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకూ వీలు పడలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి కి విజయేంద్రులకు ఇప్పటికి క్లారిటీ వచ్చిందని అర్థమవుతోంది.
స్క్రిప్టు ఫైనల్ అయ్యాకే మహేష్ కానీ రాజమౌళి కానీ అధికారికంగా సినిమాని ప్రకటిస్తారు. ఇక ఆ టైమ్ వచ్చేసిందని అర్థమవుతోంది. నిజానికి మహేష్ ఆగస్టు 9న తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా రివీల్ చేసారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో చాలా ప్రత్యేకమైన చిత్రం రాబోతుందని వెల్లడించారు. అలాగే ఇది `బాహుబలి` లాంటి భారీ విజువల్ బేస్డ్ సినిమా కాదని కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగని సాధారణ సినిమా కూడా కాదు. అందరి అంచనాలను తలకిందులు చేసే స్థాయిలో జక్కన్న స్క్రిప్ట్ ఉంటుందని ప్రచారమైంది. అడవి నేపథ్యంలో అడ్వంచరస్ థ్రిల్లర్ కథాంశంతో స్క్రిప్టును తీర్చిదిద్దుతున్నారని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత మరో కొత్త జానర్ స్క్రిప్టును కూడా మహేష్ పరిశీలించారని కథనాలొచ్చాయి. అయితే ఏది ఖాయమైంది? ఎలాంటి సినిమా చేస్తారు? అన్నది మహేష్ కానీ జక్కన్న కానీ క్లారిటీ గా చెప్పాల్సి ఉంటుంది.
గరుత్మంతుని కథతో..!
సరిగ్గా బాహుబలి రిలీజ్ అనంతరం జక్కన్న తో మహేష్ సినిమా ఫిక్సయ్యిందని ఇది పురాణేతిహాసాల నేపథ్యంలో కథతో తెరకెక్కుతుందని కూడా ప్రచారమైంది. అప్పట్లోనే మహేష్ ని గరుత్మంతుడిగా రాజమౌళి చూపిస్తారని కూడా టాక్ వినిపించింది. దానికోసం మహేష్ తన రూపం మార్చుకుంటారని గుసగుస వైరల్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఎందుకనో ఆ టాపిక్ తెర మరుగైంది. మరోవైపు అల్లు రామాయణంలో మహేష్ శ్రీరాముడి పాత్రలో నటిస్తారని కూడా ఇటీవల గుసగుస వైరల్ అయింది. కానీ మహేష్ దానిని ధృవీకరించలేదు. అంటే రామాయణంలో నటించేందుకు అవకాశం లేదనే దీనర్థం. ఎట్టకేలకు మహేష్ దృష్టి పూర్తిగా రాజమౌళి తో స్క్రిప్టును ఫైనల్ చేయించుకునే పనిలోనే ఉందని అర్థమవుతోంది.