Begin typing your search above and press return to search.

ముంబైలో మ‌హేష్ NYE 2020 వేడుక‌లు

By:  Tupaki Desk   |   27 Dec 2019 12:09 PM GMT
ముంబైలో మ‌హేష్ NYE 2020 వేడుక‌లు
X
కొత్త సంవ‌త్స‌రంలో అడుగు పెట్టేందుకు నాలుగురోజులే స‌మ‌యం మిగిలి ఉంది. సామాన్యులు మాన్యులు అనే తేడా లేకుండా ప్ర‌పంచం అంతా ఇప్ప‌టికే న్యూ ఇయ‌ర్ వేడుక‌లు స‌ర్వం సిద్ద‌మ‌వుతోంది. సెల‌బ్స్ వ‌ర‌ల్డ్ లోనూ ఈసారి సెల‌బ్రేష‌న్స్ అంబ‌రాన్నంట‌నున్నాయ‌న్న స‌మాచారం ఉంది. ప‌లువురు స్టార్లు విదేశాలు చెక్కేసి ఎంచ‌క్కా ఎంజాయ్ చేసే ప్లాన్ లో ఉన్నార‌ట‌. టాలీవుడ్ లో చాలా మంది విదేశాల్లో ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌తి ఏడాదీ మ‌హేష్ కుటుంబ స‌మేతంగా NYE 2020 కోసం విదేశాల‌కు వెళ్లి ఎంజాయ్ చేసేవాడు. అయితే ఈసారి అలా వెళ్ల‌డం లేదు. స్వ‌దేశంలోనే ముంబైలో సెల‌బ్రేష‌న్స్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌హేష్... న‌మ్ర‌త‌.. పిల్ల‌లు గౌత‌మ్-సితార‌ల‌తో క‌లిసి ముంబైలో 31 రాత్రి వేడుక‌ల్లో పాల్గొంటాడుట‌.

అటుపై తిరిగి జ‌న‌వ‌రి 3న హైద‌రాబాద్ కి తిరిగి వ‌స్తాడు. అయితే మ‌హేష్ హైద‌రాబాద్ నుంచి బ‌య‌లు దేరే డేట్ మాత్రం ఇంకా లీక‌వ్వ‌లేదు. ఇంకా నాలుగు రోజులు స‌మ‌యం ఉంది కాబ‌ట్టి ఈలోపు క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇటీవ‌లే మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రీక‌ర‌ణ పూర్తిచేసి డ‌బ్బింగ్ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు. ముందుగా మ‌హేష్ కి సంబంధించిన ప‌నుల‌ను పూర్తిచేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక మ‌హేష్ ముంబై నుంచి తిరిగి రాగానే జ‌న‌వ‌రి 5న ఎల్.బి స్టేడియంలో జ‌రిగే ప్రీ రిలీజ్ వేడుక‌లో పాల్గొంటాడు. అనంత‌రం ఆ వారం రోజులు స‌రిలేరు నీకెవ్వ‌రు ప్ర‌చారానికే స‌మ‌యం కేటాయించ‌నున్నారు.

ప‌త్రిక‌లు- ఛానెళ్లు- వెబ్ ఇంట‌ర్వూలు అంటూ మ‌హేష్‌ బిజీ బిజీగా గ‌డ‌ప‌నున్నారు. జ‌న‌వ‌రి 11న స‌రిలేరు నీకెవ్వ‌రు రిలీజ్ కాగానే మ‌ళ్లీ విహార యాత్ర‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. అనంత‌రం మ‌హేష్ త‌దుప‌రి ప్రాజెక్ట్ పై క్లారిటీ వ‌స్తుంద‌ట‌. ఇప్ప‌టికే ప‌లువురు ద‌ర్శ‌కులు మ‌హేష్ కు క‌థ‌లు వినిపించి వెయిట్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి మ‌హ‌ర్షి త‌ర్వాత మ‌రో హీరో తో చేయాల‌నే ఆలోచ‌నే లేకుండా మ‌హేష్ చుట్టూనే తిరుగుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ముందుగా వంశీకే కాల్షీట్లు కేటాయించే అవ‌కాశం ఉంద‌ట‌.