Begin typing your search above and press return to search.

మళ్లీ మహేష్ బాబునే కావాలన్నారు

By:  Tupaki Desk   |   25 April 2016 12:58 PM IST
మళ్లీ మహేష్ బాబునే కావాలన్నారు
X
హైద్రాబాద్ లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఎవరు? కామన్ పీపుల్ అభిప్రాయం ఎలా ఉందనే ఓ సర్వే నిర్వహిస్తే.. ఈ లిస్ట్ లో ఎప్పటిలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు. ఈ లిస్ట్ లో సాధారణంగా ఎప్పుడూ మహేష్ బాబునే నెంబర్ వన్ గా ఎంచుకుంటూ ఉంటారు. జనాలు. ఇప్పట్లో ఈ ప్లేస్ ని వేరే ఎవరూ రీప్లేస్ చేయడమే కష్టం అనిపిస్తోంది.

హైద్రాబాద్ టైమ్స్ ప్రకటించి మోస్ట్ డిజైరబుల్ 2015లో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రెండో స్థానంలో నిలవగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడో స్థానంలో నిలిచాడు. బాహుబలి తర్వాత విపరీతమైన క్రేజ్ పెంచుకున్న ప్రభాస్.. ఫోర్త్ ప్లేస్ లో నిలవగా.. అదే సినిమాలో భల్లాలదేవుడిగా ఆకట్టుకున్న దగ్గుబాటి రాణా ఐదో స్థానంలో ఉన్నాడు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఆరో స్థానంలో నిలవగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏడో ప్లేస్ లో ఉన్నాడు.

నేచురల్ స్టార్ అయిపోయిన హీరో నాని ఎనిమిదో స్థానంలోను, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు తొమ్మిదవ ప్లేస్ లోను, టాలీవుడ్ మన్మథుడు పదో స్థానంలోనూ నిలిచారు. ఇక తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ 11వ ప్లేస్ లో నిలవడం విశేషం. త్రివిక్రమ్ కు 13, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు 15వ స్థానం దక్కగా.. హర్షవర్ధన్ రాణే - శర్వానంద్ - నితిన్ - నాగచైతన్య - రామ్ లు 16 నుంచి 20 ప్లేస్ లలో ఉన్నారు. అఖిల్ 22వ ప్లేస్ తో సరిపెట్టుకోగా.. ఈ అక్కినేని హీరోని ఫాలో చేస్తూ రాజ్ తరుణ్ 23వ స్థానం లో ఉన్నాడు.