Begin typing your search above and press return to search.

బిజినెస్ మ్యాన్ ని లైన్ లో పెట్టిన 'మహానటి'..?

By:  Tupaki Desk   |   3 April 2020 1:00 PM GMT
బిజినెస్ మ్యాన్ ని లైన్ లో పెట్టిన మహానటి..?
X
ఒక బిజినెస్ మెన్ ను కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని నేషనల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ పెళ్లంటూ వస్తున్న వార్తలు ఆమె అభిమానులను షాక్ అయ్యేలా చేస్తున్నాయి. మలయాళ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి నటి అని నిరూపించుకుంది. ఆ తర్వాత హీరో నానితో చేసిన 'నేను లోకల్' లో అదరగొట్టింది. తెలుగు తమిళ భాషల్లో వరుస అవకాశాల తో బిజీగా మారిపోయింది. తమిళ్ లో పెద్ద పెద్ద స్టార్లతో నటించిన కీర్తి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'అజ్ఞాతవాసి' చిత్రంలో నటించింది. ఇక తర్వాత తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన 'మహానటి' సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది.

ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ఫాదర్ మళయాళం లో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సురేష్ కు పొలిటికల్ గా కూడా మంచి పలుకుబడి ఉంది. అందుకే ఒక బడా బిజినెస్ మెన్ తో కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ లో కీర్తి సురేష్ ఎంగేజ్మెంట్ ఉంటుందని, కేవలం క్లోజ్ మెంబర్స్ మాత్రమే ఈ ఈవెంట్ కు అటెండ్ అవుతారని తెలుస్తుంది. కీర్తి సురేష్ పెళ్లి వార్త విన్న ఆమె ఫ్యాన్స్ అప్పుడే పెళ్లేంటి అంటూ అవాక్కవుతున్నారు. నిప్పులేనిదే పొగరాదు అంటారు కదా..అదీ నేషనల్ మీడియా కవరేజ్ అంటే ఏదో ఒక ఆధారం దొరికే ఉంటుందని అందరూ దీనిపై చర్చ స్టార్ట్ చేసారు.

అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ ఫ్యామిలీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఒకవేళ ఈ న్యూస్ నిజంగా రూమర్ అయితే కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. తెలుగులో ప్రస్తుతం 'మిస్ ఇండియా' సినిమా చేస్తున్న కీర్తి సురేష్, నితిన్ తో 'రంగ్ దే' సినిమాలో నటిస్తుంది. మహేష్ - పరశురామ్ కాంబినేషన్ లో కీర్తిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అంతేకాకుండా రజినీకాంత్ - శివ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో కూడా నటిస్తున్నది.